మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారి

మహారాష్ట్రలో కరోనా వైరస్ మొదటి కేసు 2020 మార్చి 9 న నమోదయ్యింది. మార్చి 17 న, మొదటి కరోనా సోకిన వ్యక్తి మరణించాడు.

Map of districts with confirmed cases (as of 4 May 2020)
  1000+ confirmed cases
  500–999 confirmed cases
  100–499 confirmed cases
  50–99 confirmed cases
  10–49 confirmed cases
  1–9 confirmed cases
వ్యాధికొవిడ్ 19
ప్రదేశంమహారాష్ట్ర భారతదేశం
మొదటి కేసుపూణే
ప్రవేశించిన తేదీ9 మార్చి2020
(4 సంవత్సరాలు, 1 నెల, 3 వారాలు , 1 రోజు)
కేసులు నిర్ధారించబడింది5,35,601
బాగైనవారు49,346 (13 జూన్ 2020)
క్రియాశీలక బాధితులు4,67,949
మరణాలు
18,306 (11 ఆగస్టు 2020)
ప్రాంతములు
36 జిల్లాలు
అధికార వెబ్‌సైట్
arogya.maharashtra.gov.in
Public Health Department, Maharashtra

కాలక్రమం మార్చు

రోజువారి పాజిటివ్ కేసులు

ప్రభుత్వ సహాయక చర్యలు మార్చు

మార్చి9 మహారాష్ట్రలో మొదటి పాజిటివ్ కేసు నమోదయ్యింది
మార్చి13 వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూసివేత
మార్చి14 బహిరంగ సభలు, కార్యక్రమాలపై నిషేధం
మార్చి20 అవసరమైన సేవలను మినహాయించి అన్ని కార్యాలయాలు మూసివేత
మార్చి 22 సెక్షన్ 144 , లాక్డౌన్ విధించారు
మార్చి 23 అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సరిహద్దు రాష్ట్రాలను మూసివేశారు.
మార్చి 25

ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా

లాక్ డౌన్ విధించారు.
ఏప్రిల్ 11 లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.
ఏప్రిల్ 14 మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించారు
మే 1

మే 17 వరకు దేశవ్యాప్తంగా

లాక్ డౌన్ పొడిగించారు
  • మార్చి 22 న మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 ప్రకటించింది. మార్చి 23 మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
  • మార్చి 23 న సిఎం ఉద్ధవ్ ఠాక్రే అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా కఠినమైన కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.[1]

విద్య వ్యవస్థ ప్రభావం మార్చు

పాఠశాలల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.మహారాష్ట్ర ప్రభుత్వ పరీక్షలను అన్ని రద్దు చేసింది.1 నుండి 8 వ తరగతి పరీక్షలను అన్ని రద్దు చేసింది. పరీక్షలు లేకుండా పై తరగతుల్లో వెళ్ళడానికి ఆదేశాలు జారీ చేసింది.

రవాణా వ్యవస్థ ప్రభావం మార్చు

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 11 నుండి మహారాష్ట్ర ప్రభుత్వం 20,000 కి పైగా బస్సు సర్వీసులు రద్దు చేశారు ఫలితంగా మార్చి 17 నాటికి ₹ 3 కోట్ల నష్టం వాటిల్లింది.ఇతర రాష్ట్రాల నుంచి వైరస్ వ్యాపిస్తుందని రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. మార్చి 22 నుంచి 31 మధ్య ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు భారత రైల్వే ప్రకటించింది.

పర్యాటక వ్యవస్థ ప్రభావం మార్చు

రాష్ట్రవ్యాప్తంగా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అనేక పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలను మూసివేస్తామని ఆరోగ్య అధికారులు ప్రకటించారు. పర్యాటక ప్రదేశాలు ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా , ఎల్లోరా గుహలు , రాయ్‌గడ్ జిల్లాలోని ఎలిఫాంటా గుహలు పై ప్రభావం పడింది.రాష్ట్రంలో హోటళ్ళు, టాక్సీలు ప్రైవేట్ బస్సు సర్వీసు వ్యాపారాలు రద్దు చేశారు.

ఆర్థిక రంగం మార్చు

మూలాలు మార్చు

  1. "Uddhav Thackeray imposes curfew in entire Maharashtra". The Economic Times. 2020-03-23. Retrieved 2020-03-23.