ఎనిమిది వందల తొంబై ప్రాంతాలలో చాళుక్య భీముని పై జరిగిన దండయాత్రలో రాష్ట్రకూట దళాలకు నాయకత్వం వహించి విజయవాటికను రెండవ కృష్ణుడు వశం చేసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాడు. పెరవంగూరు వద్ద జరిగిన యుద్ధంలో చాళుక్య భీముని కుమారుడు ఇఱిమర్తి గండని చేతిలో మరణించాడు. చాళుక్య భీముని మచిలీపట్నం తామ్ర పత్రాలలోని దండేబ గుండన ఇతడే. ఈ గుండన కాలం 850- 895 కావచ్చు.