మొసలికంటి సంజీవరావు

మొసలికంటి సంజీవరావు నాటక రచయిత, నవలా రచయిత, అనువాదకుడు. విశాఖపట్నం కవితా సమితి సభ్యుడు. ఇతడు 1895, మార్చి 1న విశాఖపట్నంలో జన్మించాడు.[1]

మొసలికంటి సంజీవరావు
జననంమొసలికంటి సంజీవరావు
మార్చి 1, 1895
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధితెలుగు నవలా రచయిత, నాటక రచయిత
భార్య / భర్తవేంకటరత్నమ్మ

రచనలు మార్చు

ఇతడు కొన్ని చారిత్రక వ్యాసాలను భారతి మాసపత్రికలో ప్రకటించాడు.[2]

వాటిలో కొన్ని:

  • ఔరంగజేబు రాజప్రతినిధి - భారతి 1929 (నవంబరు, డిసెంబరు సంచికలు)
  • ఔరంగ జేబు - భారతి 1930 (ఏప్రిల్, జూన్, జూలై సంచికలు)
  • మహారాష్ట్ర ప్రజా స్వాతంత్ర్య సమరము - భారతి 1936 (సెప్టెంబరు, అక్టోబరు సంచికలు)
  • సీజరు పెళ్లాం నేరం చెయ్యదు - భారతి 1938 (ఏప్రిల్ సంచిక)
  • పూర్వయుగ పారిశుద్ధ్యము సమీక్ష - భారతి 1943 (జనవరి సంచిక)
  • పాకిస్థానమును గురించి మున్షీ ఖండనము - భారతి 1943 (మార్చి సంచిక)

గ్రంథాలు మార్చు

  • సంజీవి (అనువాద నవల, మూలం: స్కాట్, 2 భాగములు)
  • బక్సారు యుద్ధము (నవల)
  • మొగలాయి దర్బారు (అనువాద నవల, మూలం: ధీరేంద్రనాథ్ పాల్, 4 భాగములు)
  • అంతఃపురము (అనువాద నవల, మూలం: జి.డబ్ల్యూ.రేనాల్డ్స్, 2 భాగములు)
  • మేరీరాణి
  • ఔరంగజేబు బాదుషా (చరిత్ర)
  • ప్లాసీ యుద్ధము (నవల)
  • నందకుమార వధ - చైతుసింగు (చారిత్రక వ్యాసాలు)

మూలాలు మార్చు

  1. ఎడిటర్. Whos Who Of Indian Writers (1 ed.). న్యూ ఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 300. Retrieved 9 December 2023.
  2. ఎన్.ఎస్.కృష్ణమూర్తి (1984). తెలుగు రచయితలు - రచనలు (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. 736. Retrieved 10 December 2023.