రాధే శ్యామ్ బార్లే

రాధే శ్యామ్ బార్లే (జననం 966 అక్టోబరు 9) పంథి జానపద నృత్యకారుడు. కళారంగంలో ఆయన చేసిన కృషికి గాను 2021లో భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[1][2] ఛత్తీస్‌గఢ్ జానపద నృత్య రూపం పంథి ద్వారా బాబా గురు ఘాసీదాస్ సందేశాలను ప్రోత్సహించడంలో, వ్యాప్తి చేయడంలో బార్లే తన వంతు కృషి చేశారు. బార్లే 1966లో భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లా పటాన్ తహసీల్లోని ఖోలా గ్రామంలో జన్మించారు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి, తరువాత ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయం నుండి జానపద సంగీతం డిప్లొమా పూర్తి చేశారు. ఆయన దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో రెగ్యులర్ ఆర్టిస్ట్, దేశవ్యాప్తంగా అనేక మహోత్సవాలలో కూడా పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు.[3]

రాధే శ్యామ్ బార్లే
జననం1966 (age 57–58)
ఖోలా గ్రామం, దుర్గ్ జిల్లా, ఛత్తీస్ గఢ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిజానపద నృత్యకారుడు
పురస్కారాలుపద్మశ్రీ, (2021)

దేవదాస్ బంజారే అవార్డు, గురు ఘాసీదాస్ సోషల్ కాన్షియస్నెస్ అవార్డు, దళిత ఉన్నతి అవార్డు, కలాసాదక్ సమ్మన్, డాక్టర్ భావర్ సింగ్ గిరిజన సేవా సమ్మన్, సామాజిక సామరస్యం అవార్డు, దౌ మహాసింగ్ చంద్రకర్ అవార్డు వంటి వివిధ అవార్డులను అందుకున్నారు.[3]

మూలాలు

మార్చు
  1. "CG's Dr Barle selected for Padma Shri award". The Hitavada. January 26, 2021.
  2. "साधना का सम्मान:पंथी नर्तक डॉ. राधेश्याम बारले को मिलेगा पद्मश्री, छत्तीसगढ़ के लिए 17वां पद्म पुरस्कार" (in Hindi). Dainik Bhaskar.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 Mishra, Ritesh (January 26, 2021). "Barle gets Padma Shri for promotion of Chhattisgarh's folk dance form". Hindustan Times.