వడ్డిబోయిన సుజాత

వడ్డిబోయిన సుజాత భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసింది.[2]

వడ్డిబోయిన సుజాత

పదవీ కాలం
2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 10 సెప్టెంబర్‌ 1966
గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

వడ్డిబోయిన సుజాత 10 సెప్టెంబర్‌ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, గుంటూరులో జన్మించింది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె ఢిల్లీ కేంద్రీయ విద్యాలయంలో ఎంఏ (పొలిటికల్‌సైన్స్‌), ఎంఏ (సైకాలజీ), ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి, 1998లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.

వృత్తి జీవితం మార్చు

వడ్డిబోయిన సుజాత ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కరలక్ష్మి వద్ద జూనియర్‌గా చేరి రాజ్యాంగ సంబంధ కేసులను వాదించింది. ఆమె స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు ప్యానెల్‌ న్యాయవాదిగా, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి న్యాయవాదిగా పని చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పని చేస్తుంది. ఆమెను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఉమేశ్‌ ఉదయ్‌ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]

మూలాలు మార్చు

  1. Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  2. Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  4. Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.