వాడుకరి:Pavan santhosh.s/కథానిలయం ప్రాజెక్టు

గురజాడ వేంకట అప్పారావు (1915-11-30 నుంచి 1910-01-01), గురజాడగానూ సుప్రసిద్ధుడైన, తెలుగు కవి, రచయిత. కన్యాశుల్కం, ముత్యాలసరములు వంటి రచనలతో ప్రసిద్ధి చెందారు. 1910లో మొదటి కథ రాసిన గురజాడ వెంకట అప్పారావు పలు కథలు రచించారు. ఉపన్యాసకునిగానూ, సంస్థాన శాసన పరిశోధకునిగానూ ఆయన పనిచేశారు.[requirements 1]

జీవిత విశేషాలు

మార్చు

గురజాడ వెంకట అప్పారావు 30 సెప్టెంబర్ 1862న విశాఖ పట్నం జిల్లాకు చెందిన ఎస్. రాయవరంలో జన్మించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విజయనగరం వంటి ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన విద్యను కొనసాగిస్తూ కళాశాల పట్టా పొందారు. ఆపైన విజయనగరం పట్టణంలో ఉపన్యాసకునిగానూ, సంస్థాన శాసన పరిశోధకునిగానూ పనిచేశారు. గురజాడ వెంకట అప్పారావు 30 నవంబరు 1915న మరణించారు.[1 1]

సాహిత్య రంగం

మార్చు

గురజాడ వెంకట అప్పారావు కన్యాశుల్కం, ముత్యాల సరాలు వంటి రచనలతో తెలుగు సాహిత్య రంగంలో సుప్రసిద్ధలు అయ్యారు. ఆయన రాసిన కథలు చిన్నకథలు, గురజాడ రచనలు - కథానికలు అన్న పేర్లతో పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి.[1 1]

కథా సాహిత్యం

మార్చు

ఆయన రాసిన కథలు పలు పునర్ముద్రణలు పొంది ప్రఖ్యాతి వహించాయి. గురజాడ వెంకట అప్పారావు రాసిన కథల జాబితా ఇది:[1 1]

  • మీ పేరేమిటి
  • దిద్దుబాటు
  • కన్యక (పద్యం)
  • ....

కవిత్వం

మార్చు

గురజాడ కవిగానూ ప్రసిద్ధి పొందారు. ఆయన రాసిన కొన్ని ప్రసిద్ధ ప్రచురిత కవితలు ఇవి[నోట్ 1]:

  • కన్యక
  • ఉమాపతి యర్చన
  • ఊటి చోద్యమేమి చెపుదు..
  • ...

పురస్కారాలు, గౌరవాలు

మార్చు
  • మహాకవి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 పలువురు, సేకర్తలు. "గురజాడ వెంకట అప్పారావు". కథానిలయం. మనసు ఫౌండేషన్.

తిలక్ గా ప్రసిద్ధుడైన దేవరకొండ బాలగంగాధర తిలక్ తెలుగు రచయిత, కవి[నోట్ 2]. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తిలక్ ఆగస్టు 1, 1921న జన్మించి జూన్ 30, 1966న మరణించారు. తిలక్[నోట్ 3] కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంటి గౌరవాలు పొందారు. అమృతం కురిసిన రాత్రి ఆయన సుప్రసిద్ధ రచన.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

దేవరకొండ బాలగంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లాలోని మండపాకలో జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలో విద్యాభ్యాసం సాగించారు.

రచన రంగం

మార్చు

కథా రచన

మార్చు

తిలక్ రాసిన తొలి కథ ఏప్రిల్ 1, 1935న ప్రచురితం అయింది. అప్పటి నుంచి ఆయన పలు కథలు రచించారు. ఆయన రచించిన పలు కథలు ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి మొదలైన పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ప్రచురితమైన ఆయన కథా సంకలనాల జాబితా ఇలా వుంది:

  • ఊరి చివర యిల్లు (1961)
  • తిలక్ కథలు (1983)
  • సుందరీ సుబ్బారావు (1961)

రచనల జాబితా

మార్చు

దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన రచనల జాబితా ఇది:[నోట్ 4]

  • దుర్మరణ వార్త (కవిత)
  • దేవుణ్ణిచూసినవాడు (కథ)
  • దొంగ (కథ)
  • నల్లజర్ల రోడ్డు (కథ)
  • నవ్వు (కథ)
  • నిర్మలమొగుడు (కథ)
  • నీడలు (కవిత)
  • పరివర్తన (కథ)
  • పలితకేశం (కథ)
  • .....

తిలక్ తన 45వ ఏట జూన్ 30, 1966న మరణించారు.

గుంటూరు శేషేంద్రశర్మ (20 అక్టోబర్ 1927 – 30 మే 2007) ప్రముఖ రచయిత. ఆయన రచించిన నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ తదితర రచనలు సుప్రసిద్ధి పొందాయి. భారత ప్రభుత్వం రాష్ట్రేందు బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంటి అవార్డులు, గౌరవాలు పొందారు.

జీవిత విశేషాలు

మార్చు

జననం, విద్యాభ్యాసం

మార్చు

గుంటూరు శేషేంద్రశర్మ అక్టోబర్ 20, 1927న నెల్లూరు జిల్లా నాగరాజుపాడు గ్రామంలో జన్మించారు. గుంటూరు, చెన్నై వంటి ప్రదేశాల్లో విద్యాభ్యాసం చేసి కళాశాల పట్టా పొందారు.

ఉద్యోగ జీవితం

మార్చు

మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.

గుంటూరు శేషేంద్ర శర్మ 80 సంవత్సరాల పాటు జీవించి, మే 30, 2007న మరణించారు.

రచన రంగం

మార్చు

గుంటూరు శేషేంద్ర శర్మ తొలి కథను 1968లో రాశారు. ఆయన రాసిన రచనల్లో నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి వంటివి సుప్రసిద్ధి పొందాయి. ఎగిరిపోయిన హంస, మబ్బుల్లో దర్బారు, రంగులచేప, విహ్వల వంటి కథలు రాశారు. మిశ్రకృతి, విహ్వల, విహ్వల కథలు వంటి కథా సంపుటాలు ప్రచురితమైనాయి.

కథల జాబితా

మార్చు

ఆయన రచించిన కథల జాబితా ఇది:

  • ఎగిరిపోయిన హంస
  • మబ్బుల్లో దర్బారు
  • రంగులచేప
  • ....

కథా సంపుటాలు

మార్చు

ఆయన కథలు ఈ కథా సంపుటాల్లో ప్రచురితమయ్యాయి:

  • మిశ్రకృతి
  • విహ్వల
  • విహ్వల కథలు
  • ...

అవార్డులు, గౌరవాలు

మార్చు

గుంటూరు శేషేంద్ర శర్మ తన సాహిత్య సేవకు పలు పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. వాటిలో కొన్ని ప్రముఖమైన గౌరవ సత్కారాలు ఇలా ఉన్నాయి:

  • భారత ప్రభుత్వ రాష్ట్రేందు బిరుదం
  • కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

కలవకొలను సదానంద (జననం:22 ఫిబ్రవరి 1939[నోట్ 5]) ప్రముఖ తెలుగు రచయిత. ఆయన తన రచనకు గాను ఆం. ప్ర. సాహిత్య అకాడమీ అవార్డు, 1976[నోట్ 6] పొందారు. నవ్వేపెదాలు ఏడ్చేకళ్ళు, రంగురంగుల చీకటి, పైరగాలి, రక్తయజ్ఞం అన్న కథా సంపుటాలు ఆయన కథలతో ప్రచురితమయ్యాయి. అందరూ నిద్రపోతున్నారు, అక్షర సత్యాలు, అదుగో అదుగో మన జెండా వంటి 100కు పైగా కథలను ఆయన రచించారు. భారతి, ఈనాడు, ఇండియాటుడే వంటి పత్రికల్లో ఆయన కథలు ప్రచురితమయ్యయి.

కలవకొలను సదానంద చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత. ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని భారతం మిట్టలో నివాసిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

కలవకొలను సదానంద 22 ఫిబ్రవరి 1959లో జన్మించారు. ఆయన జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల గ్రామం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన భారతం మిట్టలోనే నివాసం ఉంటున్నారు.

సాహిత్య రంగం

మార్చు

1959లోనే ఆయన 20వ ఏట [నోట్ 7] తొలి కథ ప్రచురితమైంది. భారతి, ఈనాడు, సాహిత్యనేత్రం, ఇండియా టుడే వంటి పత్రికల్లో ఆయన రచించిన పలు కథలు ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికల్లో 100కు పైగా కథలు రచించారు. పలు కథా సంపుటాలు ఆయన కథలలోని కొన్నిటితో ప్రచురితమయ్యాయి.

రచనల జాబితా

మార్చు

పుస్తకాలు

మార్చు

ఆయన రచించిన కొన్ని పుస్తకాల జాబితా ఇది:[నోట్ 8]

  • నవ్వేపెదాలు ఏడ్చేకళ్లు
  • పైరుగాలి
  • రంగురంగుల చీకటి
  • రక్తయజ్ఞం

కలవకొలను సదానంద ప్రచురిత కథల జాబితా ఇది:

  • అందరూ నిద్రపోతున్నారు
  • అక్షర సత్యాలు
  • అదిగో అదిగో మన జెండా
  • .....

అవార్డులు

మార్చు

కలవకొలను సదానంద ఆం.ప్ర.సాహిత్య అకాడమీ అవార్డు, 1976 పొందారు.

బొల్లిముంత శివరామకృష్ణ (జననం.27 నవంబరు 1920) తెలుగు రచయిత, ఉపాధ్యాయుడు. ఆయన సాహిత్యంలో మృత్యుంజయులు అన్న రచన సుప్రసిద్ధమైనది. గుంటూరు జిల్లాకు చెందిన శివరామకృష్ణ కథలు అంతరాత్మ, సూక్ష్మంలో మోక్షం వంటి పలు కథా సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. ఆయన రచించిన కథల్లో అంతరాత్మ అంత్యక్రియలు, అది ఒక మగమహర్షి ప్రేమలేఖ, అనాథప్రేత సంస్కారం, అనుభవ గీత, అన్యాయ మహారాజు కథ వంటి కథలు ఉన్నాయి.

శివరామకృష్ణ గుంటూరు జిల్లాకు చెందిన రచయిత. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా హైదరాబాద్ లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరులోనే నివసిస్తున్నారు.[requirements 2]

జీవితాంశాలు

మార్చు

బొల్లిముంత శివరామకృష్ణ గుంటూరు జిల్లాలో 27 నవంబరు 1920న జన్మించారు. గుంటూరు నగరంలోనే విద్యాభ్యాసం చేశారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో నివసించారు. ఆయన ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోనే నివసిస్తున్నారు.

రచన రంగం

మార్చు

బొల్లిముంత శివరామకృష్ణ అనేక కథలు రచించారు. అవి బొల్లిముంత శివరామకృష్ణ కథలు, అంతరాత్మ, సూక్ష్మంలో మోక్షం సంపుటులుగా ప్రచురితమయ్యాయి. ఆయన కథలు జనవాణి, ప్రజాసాహితి వగైరా పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

పుస్తకాల జాబితా

మార్చు

ఆయన కథల సంపుటుల జాబితా ఇది.

  • అంతరాత్మ...(1954)
  • బొల్లిముంత శివరామకృష్ణ కథలు (1990)
  • సూక్ష్మంలో మోక్షం (1954)

కథల జాబితా

మార్చు

ఆయన రచించిన కొన్ని కథల జాబితా ఇది:

  • అంతరాత్మ అంత్యక్రియలు
  • అది ఒక మగమహర్షి ప్రేమలేఖ
  • అనాథప్రేత సంస్కారం
  • అనుభవ గీత
  • అన్యాయ మహారాజు కథ
  • అన్యాయలోకంలో
  • అరుణ సందేశం
  • ఆంధ్రాభివృద్ధికి
  • ఎబ్బెబ్బె ఏం మొగుళ్లో ఏమో
  • ఎర్రదెయ్యాలు
  • ఓ సమీక్ష
  • కొత్త జాడ్యం
  • గోరీల దొడ్లో
  • చేప చెట్టెక్కింది
  • జరగని కథ కోసం
  • జీవనగీత
  • తెలుగు ప్రాణి
  • దేశం ఏం కావాలి
  • నాయక దేవతా ప్రీత్యర్ధం
  • పరిశోధన
  • పాపభూతి
  • పాలేరు
  • పిచ్చిపెళ్లి
  • పేదరికం
  • ప్రజాసేవ
  • ప్రతిఫలం
  • ప్రాణం వెల
  • మగాళ్లెప్పుడూ ఇంతే
  • మావారూ, శ్రీవారూ, మామంచివారూ
  • మైనస్ అబ్బాయి ప్లస్ అమ్మాయి
  • రూలు హోం రూలు
  • వెనకడుగు
  • వేకువనే నిద్రపొమ్ము
  • సమ్మె పిలుపు
  • సూక్ష్మంలో మోక్షం
  • సూది సోది
  • స్వాతంత్ర్యం

కొమ్మూరి వేణుగోపాలరావు

మార్చు

కొమ్మూరి వేణుగోపాలరావు (జ.04-09-1935) ప్రఖ్యాత రచయిత. ఆయన బహు గ్రంథకర్త. వైద్య విద్యను అభ్యసించిన ఆయన వృత్తిరీత్యా వైద్యునిగా, ప్రవృత్తి రీత్యా సాహిత్యకారునిగా ప్రసిద్ధులయ్యారు. ఆయన రాసిన కాంతికిరణాలు, సూర్యోదయం వంటి పుస్తకాలు రచించారు.

జీవిత చరిత్ర

మార్చు

కొమ్మూరి వేణుగోపాలరావు 04-09-1935న కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో జన్మించారు. ఆయన విజయవాడలో విద్యాభ్యాసం చేసి వైద్య పట్టా పొందారు. వృత్తి రీత్యా స్థిరపడ్డ వేణుగోపాలరావు రచయితగా ప్రఖ్యాతమయ్యారు.

సాహిత్య కృషి

మార్చు

06-07-1951న ఆయన తొలి కథ ప్రచురితమైంది. ఆపై సంవత్సరాల్లో పలు రచనలు చేసి బహు గ్రంథకర్తగా, రచయితగా సుప్రసిద్ధి పొందారు. ఆయన రచించిన కథల జాబితా ఇది:

  • అంతస్థులు
  • అడుగడుక్కీ
  • అతీతుడు
  • .....

ఆయన ప్రచురిత గ్రంథాల జాబితా ఇది:

  1. కాంతికిరణాలు
  2. కొమ్మూరి వేణుగోపాలరావు కథలు
  3. కొమ్మూరి వేణుగోపాలరావుకథలు
  4. సూర్యోదయం
  5. స్వార్థ త్యాగం
  6. హృదయం లేని మనిషి

పురాణం సుబ్రహ్మణ్య శర్మ

మార్చు

పురాణం సుబ్రహ్మణ్య శర్మ సుప్రసిద్ధ రచయిత. ఆయన పురాణం సీత అన్న మారుపేరుతో కూడా సాహిత్య కృషి సాగించారు. ఫీచర్లు, పుస్తకాలు, కథలు వంటివి బహుళంగా రచన చేశారు.

సాహిత్య విశేషాలు

మార్చు
  • పురాణం సుబ్రహ్మణ్య శర్మ మారుపేర్లలో పురాణం సీత వంటివి కూడా ఉన్నాయి.
  • 1946లో ఆయన తొలి కథ ప్రచురితమైంది.
  • ఆయన ఇల్లాలి ముచ్చట్లు1, ఇల్లాలి ముచ్చట్లు 2, పూల బజారు, మంచం కింద మరచెంబు, మధురవాణి ఇంటర్వ్యూలు వంటి ఫీచర్లు రాశారు.
  • కథాసాగరం 14, కలకానిది, నీలి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ కథలు, బృందావనం మొదలైన కథా సంపుటాలను వెలువరించారు.
  • ఆహ్వానం, జ్యోతి, ఆంధ్రపత్రిక, తెలుగుజ్యోతి మొదలైన పత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి.

కథల జాబితా

మార్చు
  1. అడవి మొక్క
  2. అదృష్ట హీనులు
  3. అనుకోని అతిథి
  4. ...

కాళీపట్నం రామారావు ప్రముఖ తెలుగు కథకులు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావు వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రవృత్తి రీత్యా సాహిత్య రచనలు చేశారు. యజ్ఞం వంటి సుప్రసిద్ధ రచనలతో పాటు అనేక పుస్తకాలు వెలువరించారు. ఆయన సాహిత్య కృషిని గౌరవిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో ఆయనను సత్కరించారు. అడ్డం తిరిగిన చరిత్ర మూలం, అదృశ్యం, అన్నెమ నాయురాలు వంటి కథలు, కాళీపట్నం రామారావు కథలు, నేటి కథ, రుతుపవనాలు వంటి పుస్తకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.

జీవితం

మార్చు

కాళీపట్నం రామారావు శ్రీకాకుళం జిల్లా పొందూరులో జన్మించారు. ఆయన శ్రీకాకుళంలో విద్యాభ్యాసం చేశారు. విశాఖపట్టణంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని గడిపారు.

సాహిత్యం

మార్చు

రామారావు సెప్టెంబర్ 1943లో తొలి కథను రచించారు. ఆయన రచనల్లో యజ్ఞం అత్యంత సుప్రసిద్ధిని పొంది ఆయనను ఆంధ్ర సాహిత్య పాఠకులకు చేరువ చేసింది. రామారావు బహు గ్రంథకర్త. ఆయన ప్రచురిత గ్రంథాల్లో కాళీపట్నం రామారావు రచనలు, నేటి కథ వంటివి ఉన్నాయి. ఆయన రాసిన కథల జాబితా ఇది:

  • అడ్డం తిరిగిన చరిత్రమూలం.
  • అదృశ్యం
  • అన్నెమ నాయురాలు
  • అప్రజ్ఞాతం
  • ....

గౌరవాలు

మార్చు
  • కాళీపట్నం రామారావు సాహిత్య రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందజేశారు.

రాచకొండ విశ్వనాథ శాస్త్రి తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధి పొందిన రచయిత. విశాఖ పట్టణం జిల్లాకు చెందిన విశ్వనాథ శాస్త్రి తొలి కథను 1939లో రాశారు.

విశేషాలు

మార్చు
  • రావిశాస్త్రి, కాంతా కాంత, గోల్కొండ రాంప్రసాద్, జాస్మిన్, విశారా, అంజానా వంటి మారుపేర్లతో ఆయన సాహిత్య సృష్టి చేశారు.
  • విశ్వనాథ శాస్త్రి జన్మించింది, జీవించింది విశాఖపట్టణం నగరంలోనే
  • ఆయన తొలి రచన డిసెంబరు 1939లో ప్రచురితం అయింది.

రచనల జాబితా

మార్చు

ఆయన ప్రచురిత గ్రంథాల జాబితా ఇలా ఉంది:

  1. ఋక్కులు (1995)
  2. ఓ మంచివాడి కథ (1987)
  3. కథాసాగరం 13 (1955)
  4. నాలుగార్లు (1994)
  5. బాకీకథలు, కలకంఠి, ఓ మంచివాడి కథ, ఇతర కథలు (1995)

ఆయన ప్రచురిత కథల జాబితా ఇది:

కథ పత్రిక తేదీ
ఆఖరి దశ భారతి 01-08-1950
అగ్గిపుల్ల యువ 1962-07-01
...

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రముఖ తెలుగు కథకుడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యశాస్త్రి 1915లోనే తన మొదటి కథ రచించారు. ఆయన రచనలతో నిలువుచెంబు, చిన్నకథలు 11, చిన్నకథలు 4 వంటి పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

సాహిత్య కృషి

మార్చు

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనేక మారుపేర్లతో, కలంపేర్లతో సాహిత్య కృషి చేశారు. వాటిలో తార్కికుడు, శాస్త్రి, వాచస్పతి, కౌశికుడు వంటివి ఉన్నాయి. ఆయన రాసిన కథాసంపుటాలు చిన్నకథలు 11, చిన్నకథలు 4, నిలువు చెంబు, పురాణ గాథలు 1, పుల్లంపేట జరీచీర, పూలదండ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు 1, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు 2, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు 3 వంటి పేర్లతో ముద్రితం అయ్యాయి. ఈ రచనలతో ఆయన తెలుగు సాహిత్యలోకంలో సుప్రఖ్యాతులు అయ్యారు. ఆయన రాసిన కథల్లో అన్నంతపనీ జరిగింది (1934), అపిదళతి వజ్రస్య హృదయం (1934), అబ్దుల్ రజాక్ ఖాన్ లారీ (1934)............................ వంటివి ఎన్నో ఉన్నాయి.

శ్రీపాద వారు ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రభూమి, భారతి, ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, రెడ్డి రాణి, నవోదయ, ఆంధ్రభూమి, మానవసేవ, కిన్నెర, కళ్యాణి, ఆంధ్రశిల్పి, అభ్యుదయ.... మొదలైన అనేకానేక పత్రికల్లో తమ కథలు వెలువరించారు.

  1. (కవిత) (పద్యం) అని ఇచ్చిన రచనలు ఇక్కడికి వస్తాయి
  2. ఆయన రచనల జాబితాలో (కవిత) అని పలు అంశాలుండడాన్ని ఆధారంగా కవిగా స్వీకరించాలి
  3. కొన్నిచోట్ల వాడుకనామం కొన్ని చోట్ల పేరు స్వీకరిస్తే వైవిధ్యం వస్తుంది
  4. పునర్ముద్రణలు ఉండడంతో ఒకే కథ రెండు, మూడు సార్లు ప్రచురితం కావచ్చు. రెండోదాన్ని పరిహరించేందుకు ప్రయత్నించాలి.
  5. కీర్తిశేషులు? అన్న ప్రశ్నకు Alive అని సమాధానం ఉన్నట్టైతే వారికి జననం.×× ×××× ×××× అనే ఉండాలి
  6. సంక్షిప్త అక్షరాలతోనే సైట్లో ఉంది కనుక యాంత్రికంగా సంక్షిప్త అక్షరాలే వస్తాయి. తర్వాత వాడుకరులు ఆ పేరును ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా సవరిస్తారు.
  7. ఈ వివరం నేరుగా సైట్ లో దొరకదు జన్మించిన తేదీ, తొలి కథ రాసిన తేదీకి మధ్య కాలాన్ని యాంత్రికంగా గణించి రాబట్టాలి.
  8. వీటిలోకి కేవలం కథా సంపుటాలు మాత్రమే రావాలి, కథా సంకలనాలు కూడా జాబితాలో ఇచ్చారు. అవి ఎవరెవరో రచయితలు రాసిన కథలకు సంకలనం కనుక సరికాదు.
  1. పేరు, వాడుకనామం, జననం, కీర్తిశేషులు?=Dead, మరణం, తొలికథ తేదీ, పుట్టిన ఊరు, పుట్టిన జిల్లా, చదువు, చదివిన జిల్లా, చదివిన ఊళ్ళు, వృత్తి, ఉద్యోగపు ఊళ్ళు, పురస్కారాలు, ప్రసిద్ధ రచనలు ఉండాలి. కథలులో కవితలు, పద్యాలు కూడా బ్రాకెట్లో ఉండటం, కథా సంపుటాలు ఉండడం
  2. పేరు, జననం, కీర్తిశేషులు?=Alive, పుట్టిన జిల్లా, చదివిన ఊళ్ళు, ఉద్యోగపు ఊళ్ళు, వృత్తి వివరాలు ఉండాలి. కథలు ఉండాలి. పుస్తకాలులో కథా సంపుటాలు ఉండాలి.