వాసుదేవ్ ఆచార్య

వాసుదేవ్ఆచారి (11 జూలై 1942 - 13 నవంబర్ 2023) ఒక భారతీయ బెంగాలీ - రాజకీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాజకీయ పార్టీ నాయకుడు. [1]

పార్లమెంట్ సభ్యుడు
వాసుదేవ్ ఆచార్య
పార్లమెంట్ సభ్యుడు
In office
1980–2014
అంతకు ముందు వారుబిజోయ్ మండల్
తరువాత వారుమూన్ మూన్ సేన్
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా , లోక్సభ నాయకుడు
In office
2004–2014
అంతకు ముందు వారుసోమనాథ్ చటర్జీ
తరువాత వారుపి. కరుణాకరన్
వ్యక్తిగత వివరాలు
జననం1942 జులై 11
బీరో బెంగాల్ పెసిడెన్సి, బ్రిటిష్ ఇండియా
మరణం2023 నవంబర్ 13
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి ఆచార్య
సంతానం3
As of సెప్టెంబర్ 17, 2006
Source: [1]

బాల్యం మార్చు

కనై లాల్ ఆచార్య కోనక్ లతా ఆచార్య దంపతుల కుమారుడిగా పురూలియా జిల్లాలోని బెరోలో వాసుదేవ్ ఆచార్య జన్మించాడు. అతను పురూలియా జిల్లాలోని కాంతరంగుని, అద్రాలో నివసించాడు. అతను ఎంఏ బీటెక్ చదివాడు.

తొలి రాజకీయ జీవితం మార్చు

వాసుదేవ్ ఆచార్య 1980లో బంకురా నియోజకవర్గం నుంచి 7వ లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు.

ఆచార్య సీపీఐ(ఎం) పురులియా జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు..

1985 నుండి వాసుదేవ్ ఆచార్య వరకు సిపిఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

రాజకీయ జీవితం మార్చు

వాసుదేవ్ ఆచార్య 1989, 1991, 1996, 1998, 1999, 2004 [2] లో 9సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

వాసు దేవ్ ఆచార్య 1990 నుండి 1991 వరకు పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశారు.1993 96 మధ్య అతను ప్రభుత్వ హామీల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నాడు.

సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత 2004లో 14వ లోక్‌సభలో సిపిఐ (ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వాసుదేవ్ ఆచార్య ఎన్నికయ్యారు. 2007లోవాసు దేవ్ ఆచార్య రైల్వే కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. [3]

2009లో, అతను 15వ లోక్‌సభలో సీపీఐ (ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆగస్టు 2009 నుండి 2014 వరకు, వాసుదేవ్ ఆచార్య వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.

వాసుదేవ్ ఆచార్య ఎంపీగా అనేక దేశాలను సందర్శించారు.

మరణం మార్చు

వాసుదేవ్ ఆచార్య 1975 ఫిబ్రవరి 25న రాజలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వాసుదేవ్ ఆచార్య 13 నవంబర్ 2023న 81 సంవత్సరాల వయస్సులో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మరణించారు.[4]

మూలాలు మార్చు

  1. Datta, Romita (2014-04-21). "In Bankura, it's a battle between the old guard and the new order". Livemint. Retrieved 2018-04-03.
  2. "Detailed Profile: Shri Basudeb Acharia". india.gov.in website. Archived from the original on 29 March 2012. Retrieved 28 March 2010.
  3. "Basudeb Acharya". 8 March 2014.
  4. Andhrajyothy (14 November 2023). "సీపీఐ(ఎం) నేత వాసుదేవ ఆచార్య కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.