వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 28వ వారం

విద్యా ప్రకాశానందగిరి స్వామి
శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు, శ్రీ గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరీ వ్యవస్థాపకులు.

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆనంద నామ సంవత్సర చైత్ర బహుళ తదియ (13-4-1914) నాడు బందరులో శ్రీ రామస్వామి, సుశీలా దేవి అనే పుణ్య దంపతులకు మూడవ పుత్రుడుగా స్వామివారు జన్మించారు. తండ్రి గారైన శ్రీ రామస్వామిగారు న్యాయవాది. గొప్ప దేశభక్తి గలవారు. హైందవ సమాజాన్ని చక్కగా సంస్కరించాలంటే దృఢ సంకల్పంతో పనిచేసిన సంఘసంస్కర్త భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలను భాషంతో సహా అధ్యయనం చేశారు. శిష్టాచార సంపన్నులైన ఈ పుణ్య దంపతుల ఇంటికి తరచుగా విద్వాంసులు, సాధు మహాత్ములు వచ్చేవారు. వేదాంత గోష్టులు జరుగుతుండేవి. స్వామి వారి బాల్యనామం "ఆనంద మోహన్". చిన్నతనంలోనే ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించేవారు. పసితనం నుంచె ఎంతో దైవ భక్తి ఉండేది. రామస్వామి గారు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నారు.. వకీలు వృత్తికి రాజీనానామా చేసి చిన్న పర్ణ కుటీరంలో జీవిస్తూ, ధ్యానం, జపం, భజన, పారాయణం, అర్చన, ఆత్మవిచారణ,వేదాంతగోష్టులతో కాలం గడపసాగారు. ఆదర్శ గృహిణి సుశీలాదేవి భర్తకు అన్ని విధాలా సహకరించేవారు. సహజంగానే ఆధ్యాత్మిక సంస్కారం గల ఆనంద మోహనుని చిత్త వృత్తి దైవ మార్గంలో పురోగమించటానికి వాతావరణం అనుకూలించింది.

(ఇంకా…)