వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 20వ వారం

జిడ్డు కృష్ణమూర్తి

జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజం లో మౌలిక మార్పు. జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లి లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసు లో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజం కి అంతర్జాతీయ కేంద్రం గా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి , ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రం లో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటి తో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయం లో కృష్ణమూర్తి సంస్కృతమూ , ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు.

(ఇంకా…)