వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 01వ వారం

భారతదేశంలోని ఏడు అద్భుతాలు

ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన మానవ నిర్మిత కట్టడాలు మరియు సహజసిద్ధ వస్తువుల పట్టికను రూపొందించేందుకు ప్రపంచ అద్భుతాలుతో కూడిన వివిధ జాబితాలను తరాలుగా సంగ్రహించడం జరుగుతోంది. అయితే, భారతదేశంలోని ఏడు అత్యద్భుతాలను ఎంపిక చేయడం కోసం మొదటిసారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI) వార్తా పత్రిక 2007లో జూలై 21 నుంచి జూలై 31 వరకు ఒక SMS ఎన్నిక ప్రక్రియను నిర్వహించింది, ఇందుకోసం పురాతన లేదా మధ్యయుగ కాలం నాటి 20 ప్రదేశాలను ఒక జాబితాగా రూపొందించిన ఈ వార్తా పత్రిక అందులో నుంచి ఏడు అద్భుతాలను ఎన్నుకోవాల్సిందిగా కోరింది. ఆవిధంగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భారతదేశ ఏడు అద్భుతాలు (ఇందులో నాలుగు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్) టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) పాఠకులచేత ఎన్నిక కాబడినవే. అద్భుతాలుగా పేర్కొంటూ పాఠకులు ఎంపిక చేసిన జాబితాలో ఘనకీర్తి కలిగిన ఏకశిలా విగ్రహం మొదలుకొని ప్రార్థనా మందిరం, ఒక సమాధి మరియు ఒక విశ్వవిద్యాలయం వరకు చోటు చేసుకున్నాయి. స్వర్ణ దేవాలయం మరియు తాజ్ మహల్ మినహా, ఏడు అద్భుతాలన్నీ చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కొలువుదీరినవే. అయితే, పాఠకులు ఎంపిక చేయడం కోసం ముందస్తుగా జాబితాపర్చబడిన ఇరవై స్మారక చిహ్నాల్లో నాలుగు మాత్రం మెట్రో నగరాల్లో కొలువుదీరినవి చోటుచేసుకున్నాయి, ఢిల్లీలోని లోటస్ దేవాలయం మరియు కుతుబ్ మినార్, బాంబేలోని విక్టోరియా టెర్మినస్, కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి.


(ఇంకా…)