వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 26వ వారం

విశ్వనాధ్ ప్రతాప్ సింగ్

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడినకులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని. 1969లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సభ్యుడయ్యాడు. అతను 1971 లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ ఉపమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 1976 నుండి 1977 వరకు వాణిజ్య శాఖామంత్రిగా తన సేవలనందించాడు. 1980లో జనతా పార్టీ తరువాత ఇందిరా గాంధీ మరల ఎన్నుకోబడినప్పుడు, ఇందిరా గాంధీ అతనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది.  ముఖ్యమంత్రిగా (1980–82) అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నైఋతి ప్రాంత జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రమైన సమస్య అయిన బందిపోటు దొంగతనాలను తగ్గించే కార్యక్రమాలు చేసాడు. 1983లో వాణిజ్య మంత్రిగా తన పదవిని తిరిగి ప్రారంభించాడు.  1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీని పదవినుంచి తొలగించటానికి, అతనికి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో కలసి ఒక కూటమి ఏర్పాటు చేయడానికి అతను భాద్యత వహించాడు. 1989లో అతని పాత్ర భారత రాజకీయాల దిశను మార్చింది. సింగ్ అధ్వానీ చేసిన రథయాత్రలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా ధైర్యంగా నిలిచాడు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు.

(ఇంకా…)