వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 29వ వారం

అరుణిమ సిన్హా

అరుణిమ సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం "ఎవరెస్టు" ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్‌ మాజీ క్రీడాకారిణి అరుణిమా సిన్హా చరిత్ర సృష్టించారు. మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇరవై ఐదు సంవత్సరాల సిన్హా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం చేరుకున్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన ఎకో ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్‌లో సభ్యుడు, నేపాల్‌ టూరిజం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాదిలో ఉత్తరకాశీలోని టాటా స్టీల్‌ అడ్వంచెర్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఏఎఫ్ ) లో అరుణిమా సిన్హా చేరారు. సిన్హా, జాతీయ స్థాయి వాలీబాల్ మరియు ఫుట్‌బాల్ క్రీడా కారిణి. అరుణిమా సిన్హా జీవితంలో ఏప్రిల్‌ 12, 2011 చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్‌ కంపార్టుమెంట్‌లో ఆమె ప్రయాణిస్తున్నారు.బరేలీ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగలు రైలు నుంచి కిందకు తోసేశారు. 'నా కలలు ఇక ఎప్పుడూ నెరవేరవు' అని ఆమె గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆమె ఎడమకాలు, తొడ ఎముక తీవ్రంగా దెబ్బతిన డంతో ఆస్పత్రిలో చేర్చారు. మోకాలు కింది భాగాన్ని వైద్యులు తొలగించారు.


(ఇంకా…)