వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 38వ వారం

సర్వ శిక్షా అభియాన్ 6–14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక పాథమిక హక్కుగా మార్చడం కోసం భారత కేంద్రప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం. దీనిని భారత రాజ్యాంగంలో 86వ సవరణ ద్వారా అమల్లోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం, విద్యను అన్ని వర్గాలవారికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు. నిరక్షరాస్యతను పారద్రోలి, అక్షరాస్యతను సాధించడం. పాఠశాలైన, ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకూ ఒక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ఓ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి, విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశ్యం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో వుంచి విద్యాస్థాయిని పెంపొందించడం. పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి. దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో, నాగపట్నం జిల్లాలోని సత్యనాథపురం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. (ఇంకా…)