వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 02వ వారం

వ్రిందావన్

వ్రిందావన్ ఉత్తర ప్రదేశ్, భారత దేశము నందలి మథుర జిల్లాలోని ఒక పట్టణము. ఇది కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశములో ఒకటి. ఈ పట్టణము కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో, ఆగ్రా-ఢిల్లీ రహదారికి దగ్గరలో ఉంది. ఈ పట్టణము రాథాకృష్ణుల వందలాది ఆలయాలకు నిలయముగా ఉంది. ఇది గౌడియ వైష్ణవ మతం, వైష్ణవ మతం, మరియు సాధారణ హిందూమతం లాంటి అనేక మత సంప్రదాయాలచే పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. వ్రిందావన్ కు హిందూ చరిత్రకు సంబంధించిన పురాతన చరిత్ర ఉంది. ఇది ఒక ముఖ్యమైన హిందూ పుణ్య క్షేత్రము. ఇంకనూ నిలిచి ఉన్న పురాతన ఆలయాలలో గోవింద దేవ్ ఆలయం ఒకటి. ఇది 1590లో నిర్మించబడింది. ఈ పట్టణం అదే శతాబ్దము ప్రారంభంలో కనుగొనబడింది. వ్రిందావన్ యొక్క ప్రాశస్త్యము, 16వ శతాబ్దములో భగవాన్ చైతన్య మహాప్రభు తిరిగి కనుగోనేంత వరకు కాలగర్భంలో కలిసిపోయినట్లు నమ్మబడుతోంది. శ్రీ కృష్ణ ప్రభువునకు అతిశయించిన చిలిపిచేష్టలకు సంబంధించి కనుమరుగైన పవిత్ర ప్రదేశాలను గుర్తించే ఉద్దేశంతో భగవాన్ చైతన్య మహాప్రభు, 1515లో వ్రిందావనమును సందర్శించాడు. చైతన్య మహా ప్రభువు వ్రిందావన్ యొక్క పవిత్రమైన అడవులలో తిరుగుతూ పవిత్రమైన ప్రేమలో ఆధ్యాత్మికంగా మైమరచిపోయాడు. అతని దైవికమైన ఆధ్యాత్మిక శక్తి వలన, అతను వ్రిందావనములో మరియు చుట్టుప్రక్కల కృష్ణ భగవానుడు సంచరించిన ముఖ్య ప్రదేశాలను గుర్తించగలిగాడు.

(ఇంకా…)