వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 45వ వారం

దీర్ఘ కృపాణ రాత్రి
దీర్ఘ కృపాణ రాత్రి 1934 జూన్ 30, జూలై 2 ల మధ్య నాజీ జర్మనీలో హిట్లర్ జరిపిన ఏరివేత కార్యక్రమం. దీనినే రోహ్మ్ ఏరివేత అని, ఆపరేషన్  హమ్మింగ్‌బర్డ్ (జర్మన్ భాషలో అంటర్‌నెహ్మెన్ కోలిబ్రి) అనీ కూడా అంటారు. తన అధికారాన్ని సుస్థిర పరచుకునేందుకు గాను చట్టానికి అతీతంగా హిట్లర్ జరిపిన మారణ హోమమే ఈ ఆపరేషన్. నాజీలకు చెందిన పారామిలిటరీ సంస్థ స్టర్మాబ్టీలంగ్ (ఎస్.ఏ), దాని నేత ఎర్నెస్ట్ రోహ్మ్ ల నుండి జర్మను సైనిక బలగాలకు ముప్పుందని భావించి, హిట్లర్ ఈ అపరేషన్ జరిపాడు. నాజీ ప్రచార యంత్రాంగం, రోహ్మ్ తలపెట్టిన కుట్రను ఛేదించేందుకే చెయ్యాల్సి వచ్చిన హత్యలుగా ఈ ఆపరేషన్ను చూపింది. హిట్లర్ జరిపిన ఈ ఆపరేషన్‌లో ప్రధాన పాత్ర వహించింది, షుట్జ్‌స్టాఫెల్ (ఎస్.ఎస్), గెస్టాపో అని పిలిచే రహస్య పోలీసు సంస్థలు. ఎస్.ఎస్‌కు సారథి హిమ్లర్. ఈ ఏరివేతలో చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఎస్.ఏ కు చెందిన నేతలు. వీరిలో పేరు పొందినవాడు ఎస్.ఏ అధినేత, హిట్లరుకు అనుయాయీ అయిన రోహ్మ్. నాజీ పార్టీలోని స్ట్రాసెరిస్ట్ వర్గపు నాయకుడు గ్రెగోర్ స్ట్రాసర్‌తో సహా ఆ వర్గంలోని ముఖ్య నేతలను కూడా చంపేసారు.
(ఇంకా…)