వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 22వ వారం

తులసీదాసు
గోస్వామి తులసీదాసు గొప్ప కవి. అతను ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్ (ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో జన్మించాడు . తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు . హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకనిగా నిలిచాడు. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి, సమాజంలో విశేష ప్రభావం చూపాయి. దీని కారణంగా రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం, పాపులర్ సంగీతం, టెలివిజన్ సీరియళ్ళు అనేకం విలసిల్లాయి.. ఈయన శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి. అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్‌ చాలీసాను కూడా రచించాడు. అతను వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.
(ఇంకా…)