విశాఖపట్నం రెవెన్యూ డివిజను

విశాఖపట్నం రెవెన్యూ డివిజను, విశాఖపట్నంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. విశాఖపట్నం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

విశాఖపట్నం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
ప్రధాన కార్యాలయంవిశాఖపట్నం
మండలాల సంఖ్య6

చరిత్ర మార్చు

2022 ఏప్రిల్ 4 కు ముందు ఈ రెవెన్యూ డివిజన్ లో 10 మండలాలు, 146 రెవెన్యూ గ్రామాలు ఉండేయి. భీమునిపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మండలాల సంఖ్య 6 కు తగ్గింది.[1]

రెవెన్యూ డివిజను లోని మండలాలు మార్చు

  1. గాజువాక
  2. గోపాలపట్నం
  3. పెదగంట్యాడ
  4. పెందుర్తి
  5. మహారాణిపేట
  6. ములగాడ

జనాభా గణాంకాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం డివిజన్ జనాభా 21,05,043 ఉండగా అందులో గ్రామీణ జనాభా 3,17,320 కాగా పట్టణ జనాభా 17,87,723 మంది ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 8.17% ఉండగా షెడ్యూల్డ్ తెగలు 1.14% ఉన్నారు.జనాభాలో హిందువులు 93.36% కాగా ముస్లింలు 3.29%, క్రైస్తవులు 2.67% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 93.23% తెలుగు మాట్లాడేవాళ్ళు ఉంటే ఉర్దూ 2.33%, హిందీ1.87% మాట్లాడే జనాభా ఉన్నారు.[2][3]

మూలాలు మార్చు

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు మార్చు