విశ్వనాథ సాహిత్య అకాడమీ

విశ్వనాథ సాహిత్య అకాడమీ గుంటూరు కేంద్రంగా పని చేస్తున్న సాహితీ, సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ మంచి సాహిత్య గ్రంథాలను ప్రచురించడం, కళా ప్రదర్శనలు నిర్వహించడం, ఏడాదికొకసారి కళారంగానికి సంబంధించిన వ్యక్తులకు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం, విశ్వనాథ సంస్కృతి పురస్కారం అందచేస్తుంది.[1]

పుస్తక ప్రచురణ మార్చు

  • సెప్టెంబర్ 2019 లో శ్రీరమణ దీర్ఘ కథ నాలుగో ఎకరం ప్రచురణ

పురస్కార గ్రహీతలు మార్చు

విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారం ఒక సంవత్సరం నాట్యంలో, తరువాత సంవత్సరం సాహిత్యంలో, తరువాత సంవత్సరం సంగీతంలో ప్రదానంచేస్తారు. కారణం ఆమెకి ఈ మూడు రంగాలలో ప్రవేశం ఉండటం. జానపద కళాకారులకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం అందిస్తారు.

విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారం మార్చు

  1. 2017 - నాట్య రంగం - కళావంతుల నాట్య శైలిలో ప్రతిభావంతురాలైన డా. యశోదా ఠాకోర్, హైదరాబాద్
  2. 2018 - సాహిత్య రంగం - నాటక,సాహిత్య, నాట్య, జానపద కళా పరిశోధకులు ప్రొఫెసర్ మొదలి నాగభూషణశర్మ
  3. 2019 - సంగీత రంగం - గుంటూరులో త్యాగరాజ ఆరాధన సంఘం స్థాపించి గుంటూరులో శాస్త్రీయ సంగీత అభిరుచి ఇనుమడింపచేసిన శ్రీ బుర్రా సీతారామశాస్త్రి
  4. 2020 - నాట్య రంగం - కథక్ నృత్య కళాకారిణి శరథిని గోలే
  5. 2021 - సాహిత్య రంగం - రసమయి పత్రిక సంపాదకులు, నండూరి పార్థసారథి

విశ్వనాథ సంస్కృతి పురస్కారం మార్చు

  1. 2019 లో తూర్పు భాగవతం కళాకారుడు బొంతలకోటి సాంబమూర్తి, కోమటిపల్లి (బొబ్బిలి వద్ద).
  2. 2020 లో తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యక్రమాలు". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. 27 Jan 2020. Retrieved 26 March 2020.

బయటి లంకెలు మార్చు