షేక్‌పేట సరాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోల్కొండ సమీపంలో ఉన్న భవనం. ఇది 1633-34 మధ్యకాలంలో కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా చే నిర్మించబడింది.[1][2]

షేక్‌పేట సరాయి
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంగోల్కొండ, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1633-34

నిర్మాణం మార్చు

ఈ సరాయితో ఒక మసీదు,ఒక దర్గా, 30గదులతో కూడిన రెండంతస్తుల మేడ, గుర్రం, ఏనుగు, ఒంటెలను ఉంచేందుకు వివిధ నిర్మాణాలు చేపట్టబడ్డాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా 15 గదుల చొప్పున 30 గదులు నిర్మించబడ్డాయి. ఒకేసారి 500మంది ప్రార్థనలు చేసుకునేవిధంగా ప్రధాన ద్వారానికి కుడిపైపున మసీదు నిర్మించబడింది.[3]

ఉద్దేశ్యం మార్చు

గ్రామీణ, ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇతర పనుల మీద నగరానికి వస్తూపోతున్న వారికి మూడు రోజుల పాటు ఉచిత వసతి భోజన సదుపాయాలను అందించడంకోసం ఈ సరాయి (అతిథి గృహం) నిర్మించబడింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Varma, Dr. Anand Raj. "Shaikpet sarai ravaged by nature". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 1 March 2019.
  2. "Crack in heritage: Sorry state of sarais in the Hyderabad - Times of India". The Times of India. Retrieved 1 March 2019.
  3. సాక్షి, హైదాబాదు (25 February 2019). "సొబగుల సరాయి". Archived from the original on 1 March 2019. Retrieved 1 March 2019.