సమీర్ రంజన్ దాస్

సమీర్‌ రంజన్ దాస్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నిమపారా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న పాఠశాల & సామూహిక విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

సమీర్ రంజన్ దాస్

పాఠశాల & సామూహిక విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – ప్రస్తుతం
నియోజకవర్గం నిమపారా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-22) 1962 ఏప్రిల్ 22 (వయసు 62)
బిష్ణుపూర్, పూరి జిల్లా, ఒడిషా రాష్ట్రం
తల్లిదండ్రులు రత్నాకర్ దాస్
జీవిత భాగస్వామి సంగీత దాస్

రాజకీయ జీవితం మార్చు

సమీర్ రంజన్ దాస్ బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997 నుండి 2002 వరకు జెడ్పిటిసి సభ్యుడిగా, 2002 నుండి 2007 వరకు పూరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నిమపారా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు. సమీర్ రంజన్ దాస్ 2022లో జరిగిన ఒడిశా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో పాఠశాల & సామూహిక విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు మార్చు

  1. Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.