సరస్వతీ గ్రంథాలయం

సరస్వతీ గ్రంథాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, ముక్కామల గ్రామంలో వున్న లో వున్న గ్రంథాలయం, ఈ గ్రామ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలకు కూడ విజ్ఞాన ప్రదాయిని. పూర్వం ఈ గ్రంథాలయం గ్రామ కంఠం లో వున్న రామాలయం లో నిర్వహించబడేది. ఈ గ్రామం లో జరిగే ఇతర ఉత్సవాలతో పాటు ప్రతి సంవత్సం నవంబరు నెలలో గ్రంథాలయ వారోత్సవాలు కూడ ఎంతో ఉత్సాహంగా జరుపుతారు.

గ్రంథాలయం - ప్రతీకాత్మక చిత్రం

కాలక్రమంలో మహానుభావులు యినపకొళ్ళ రాఘవరావు జ్ఞాపకార్థం అతని కుమారుడు యినపకొళ్ళ సుబ్బారావు ఆర్థిక సహాయంతో ఒక పెద్ద భవనంలోకి మార్చబడింది. వ్యవసాయదారులు ఎక్కువుగా వుండే ఈ గ్రామం లో వారికి వున్న ఏకైక కాలక్షేపం ఈ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో దినపత్రికలు, వార పత్రికలుతో పాటు ఎన్నో విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడ అందుబాటులో ఉన్నాయి

కాలక్రమం లో ఈ గ్రంథాలయం కూడ అభివృధ్ధి చెందింది. ఢిల్లీ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటు లోకి వచ్చిన కొత్తలో ముళ్ళపూడి అప్పారాయుడు, సుబ్బారావు ఎంతో నిస్వార్థంగా అందించిన ధన సహాయంతో ఈ గ్రంధాలయానికి ఒక టెలివిజన్ సమకూర్చడం జరిగింది. ఆనాటి నుండి ఇక్కడి ప్రజలకు ఎన్నో పత్రికలతో పాటు దూరదర్శన్ కార్యక్రమాలు కూడ అందుబాటులో వుండేవి.

మారుతున్న కాలానికి అణుగుణంగా ఈ గ్రామ ప్రజల నిస్వార్థ అంకిత భావంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుచున్న ఈ గ్రంథాలయం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా వుంటుందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు