సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్

సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ భారతదేశంలోని విశాఖపట్టణం నగరం చివరి ప్రాంతంలో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం. ఇది భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ చే నిర్వహించబడుతుంది.[1]

సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్
సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ దృశ్యం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ రేఖాంశాలు17°35′38″N 83°05′23″E / 17.5938°N 83.0897°E / 17.5938; 83.0897
స్థితిOperational
మొదలయిన తేదీ2002
Owner(s)NTPC

భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎన్.టి.పి.సి యొక్క బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో ఈ విద్యుత్ కేంద్రం ఒకటి. పవర్ ప్లాంట్ కోసం బొగ్గును ఒడిశాలోని తాల్చేర్ బొగ్గు గనులలోని కళింగ బ్లాక్ సమకూరుస్తుంది. ఈ ప్లాంట్ ఆస్తి, నిర్వహణ జాతీయ స్థాయిలో ఉన్నందున ఉత్పత్తి చేయబడిన విద్యుత్ బహుళ రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది. యూనిట్లు 1, 2 ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్, 1,000 MW వరకు తయారు చేయబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు అందించబడుతుంది. యూనిట్లు 3, 4 ద్వారా ఉత్పత్తి చేయబడిన మిగిలిన 1,000 మెగావాట్లు, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , పాండిచ్చేరి రాష్ట్రాలకు PPAలో నిర్ణయించిన ప్రకారం వారి వాటాల ప్రకారం కేటాయించబడతాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Simhadri Super Thermal Power Station: Latest News & Videos, Photos about Simhadri Super Thermal Power Station | The Economic Times - Page 1". The Economic Times. Retrieved 2021-08-11.

బాహ్య లంకెలు మార్చు