చెన్నబోయిన కృష్ణయాదవ్ హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. పేపర్‌బాయ్‌గా జీవనం ఆరంభించి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు. స్టాంపుల కుంభకోణంలో జైలుకు వెళ్ళి నిర్దోషిగా బయటపడ్డారు.

సి.కృష్ణయాదవ్
నియోజకవర్గం హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రాజకీయ ప్రస్థానం మార్చు

1986లో హైదరాబాదు నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత శాసనసభకు హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై ప్రభుత్వ విప్‌గా, చంద్రబాబు నాయుడు హయంలో మంత్రిగా పనిచేశారు. స్టాంపుల కుంభకోణంలో ఇతని పేరు బయటప్డగానే తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నిర్దోషిగా కేసు నుంచి బయటపడి 10 సంవత్సరాల తరువాత మళ్ళీ 2012లో తెలుగుదేశం పార్టీలో చేరారు.[1]

మూలాలు మార్చు

  1. Eenadu (5 November 2023). "నాడు కిషన్‌రెడ్డి..నేడు కృష్ణాయాదవ్‌". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.

వెలుపలి లంకెలు మార్చు