సీతారామ దేవాలయం (గంభీరావుపేట్)

సీతారామ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం, గంభీరావుపేట్ గ్రామంలో ఉన్న దేవాలయం. సుమారు 680 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయంలోని అఖండజ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంది.[1]

సీతారామ దేవాలయం
సీతారామ దేవాలయం
సీతారామ దేవాలయం
సీతారామ దేవాలయం is located in Telangana
సీతారామ దేవాలయం
సీతారామ దేవాలయం
తెలంగాణ రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు :18°18′00″N 78°35′00″E / 18.30°N 78.58330°E / 18.30; 78.58330
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రదేశం:గంభీరావుపేట్, గంభీరావుపేట్ మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:రాముడు, లక్ష్మణుడు
ప్రధాన దేవత:సీత
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి

చరిత్ర మార్చు

కాకతీయులు తమ రాజ్యంలోని కొన్ని గ్రామాలను పాలన ప్రాంతాలుగా పరిగణించి, గంభీరావుపేటను ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. క్రీస్తుశకం 1333లో కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి సంస్థానాధీశుడిగా ఉన్న వేంకటరావు దేశాయి ఈ ఆలయ అభివృద్దికి కృషి చేశాడు.

ప్రత్యేకత మార్చు

16 స్తంభాలతో నిర్మించిన కల్యాణమంటపం ఇప్పటికి నిలిచివుంది. దేవాలయానికి కొంత దూరంలో సంస్థానాధీశుడి పేరుమీద నిర్మించిన వెంకటాద్రి చెరువునుంచి ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలకి నీటిని తెస్తారు. ఆలయంలోపల ఉన్న గంటపై 1333 అనే సంఖ్య ఉంది. ఈ సంఖ్యను బట్టి ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఒక నందాదీపం ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ప్రతిష్ఠించబడిన ఈ నందాదీపం నాటినుంచి నేటివరకు వెలుగుతూనే ఉంది.

ఉత్సవాలు మార్చు

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవుడిని రథంపై ఊరేగిస్తారు.[2]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (17 November 2019). "ఆరని ఆఖండజ్యోతి గంభీరావుపేట సీతారామాలయం". www.ntnews.com. Archived from the original on 19 నవంబరు 2019. Retrieved 19 November 2019.
  2. ఈనాడు, పెద్దపల్లి (23 April 2019). "కమనీయం...రథోత్సవం - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 19 నవంబరు 2019. Retrieved 19 November 2019.