సొదుం జయరాం

తెలుగు రచయిత

సొదుం జయరాం తెలుగు రచయిత, కథకుడు. [1]

జీవిత విశేషాలు మార్చు

అతను కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించాదు. అతను ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో చదివుకున్నాడు. అతను బి.ఏ. పట్టభద్రులు.అతను కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందాడు. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి అతని పేరొందిన కథలు. అతని కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. అతను రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది.[2]

1986లో అతను రాసిన ‘కర్రోడిచావు’ రాసిన కథలను కలిపి 1991లో ‘సొదుం జయరాం కథలు’ సంకలనం వచ్చింది. పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సొదుం జయరాం సాహిత్యనేత్రం ప్రచారం ద్వారా ‘రాతిపూలు’ సంకలనం తెచ్చారు.జయరాం రాసిన 12 కథలు రష్యా భాషలోకి, కొన్ని హిందీ,కన్నడ భాషలోకి అనువదింప బడినాయి.[3]

రచనలు మార్చు

  • వాడినమల్లెలు (కథాసంకలనం)

మూలాలు: మార్చు

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2021-05-06.
  2. సొదుం జయరాం రాసిన వ్యాసం[permanent dead link]
  3. V (2020-12-25). "సొదుం జయరాం-jayaram". Rayalaseema Info (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-06. Retrieved 2021-05-06.

బాహ్య లంకెలు మార్చు