హథీరాంజీ మఠం తిరుమలలో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హథీరాం బాలాజీ అనే భక్తుని పేరుమీదున్న మఠం. తిరుమల ఆలయ నిర్వహణకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయక మునుపు హథీరాంజీ మఠం 1843 నుంచి 1932 వరకు ఆలయాన్ని నిర్వహించారు. [1][2][3] ఈ మఠానికి తిరుపతి చుట్టుపక్కల భూములున్నాయి. ఈ భూముల విషయమై పలుమార్లు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.[4]

హథీరాంజీ మఠం

చరిత్ర మార్చు

తిరుమలలో జియ్యంగారి మఠం, ఉత్తరాది మఠం, బైరాగి మఠం, శృంగేరి మఠం లాంటి అనేక మఠాలు ఉన్నా హథీరాంజీ మఠం ప్రత్యేకమైంది. మిగత మఠాలు ఏదైనా ఒక కులానికో, ఆధ్యాత్మిక సాంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తే హథీరాంజీ మఠం మాత్రం ఎవరికైనా సేవలు అందేవి. ఇక్కడికి ముఖ్యంగా ఉత్తరాది నుంచి వచ్చిన భక్తులే ఎక్కువగా ఉండేవారు.[5]

మూలాలు మార్చు

  1. "After temples, mutts are 'losing' jewelry". newindianexpress.com. ఇండియన్ ఎక్స్ ప్రెస్. Retrieved 1 October 2016.[permanent dead link]
  2. Staff, Reporter. "Hathiramji Mutt gets back its land". thehindu.com. Kasturi and Sons. Retrieved 1 October 2016.
  3. "వివాదాలకు నిలయంగా హథీరాంజీ మఠం... ఆందోళన బాటలో సాధువులు". telugu.webdunia.com. Retrieved 1 October 2016.
  4. "తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ప్రభుత్వం పరిరక్షించాలి". prabhanews.com. ఆంధ్రప్రభ. Retrieved 1 October 2016.[permanent dead link]
  5. Vasanatha, P. "Mahants Of Hathiramji Mutt 1843 1933". shodhganga.inflibnet.ac.in. Sri Venkateswara University. Retrieved 27 September 2016.