హర్మందిర్ సాహిబ్

అమృతసర్ లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వారం.

హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్గా కూడా పిలవబడుతుంది, అనధికారికంగా స్వర్ణ దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది, ఇది భారతదేశంలోని అమృతసర్ లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వారం. దీనిని 16 వ శతాబ్దం లో నాలుగవ సిక్కు గురువు గురు రాందాస్ సాహిబ్ జీ నిర్మించారు. 1604లో గురు అర్జున్ సిక్కుమతం పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని పూర్తిచేశాడు, దీనిని గురుద్వారలో ప్రతిష్ఠాపించాడు. హర్మందిర్ సాహిబ్ లోకి వెళ్లెందుకు నాలుగు తలుపులు ఉన్నాయి. ఇవి సిక్కుల నిష్కాపట్యత చిహ్నంగా అన్ని వర్గాల ప్రజల, మతాల వైపుకు ఉన్నట్లు ఉంటాయి. ప్రస్తుత గురుద్వారం ఇతర సిక్కు మిస్ల్స్ సహాయంతో జస్సా సింగ్ అహ్లువాలియా 1764 లో పునర్నిర్మించారు.

హర్మందిర్ సాహిబ్
ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ
The Golden Temple
స్వర్ణ దేవాలయం
హర్మందిర్ సాహిబ్ (దేవుని నివాసం),
అనధికారికంగా స్వర్ణ దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.[1]
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిసిక్కు నిర్మాణం
పట్టణం లేదా నగరంఅమృతసర్
దేశంభారతదేశం
భౌగోళికాంశాలు31°37′12″N 74°52′37″E / 31.62000°N 74.87694°E / 31.62000; 74.87694
నిర్మాణ ప్రారంభం1585 డిసెంబరు  AD
పూర్తి చేయబడినది1604 ఆగష్టు

మూలాలు మార్చు