అనంతపురం క్లాక్ సెంటర్

అనంతపురం క్లాక్ టవర్
అనంతపురం క్లాక్ టవర్
అక్షాంశ,రేఖాంశాలు50°50′12″N 4°21′6″E / 50.83667°N 4.35167°E / 50.83667; 4.35167
ప్రదేశంఅనంతపురం , ఆంధ్రప్రదేశ్ భారత దేశం
ఎత్తు47 అడుగులు
నిర్మాణం ప్రారంభం1945
ప్రారంభ తేదీ15- ఆగష్టు 1947

చరిత్ర మార్చు

అనంతపురం క్లాక్ సెంటర్ అనంతపురం నగరంలోని ఒక చారిత్రిక ప్రదేశం. అనంతపురం అనగానే గుర్తుకు వచ్చేది టవర్ క్లాక్. దీనికి ఎంతో చరిత్ర వుంది . ఇది ఎందరో మహనీయుల త్యాగం ఫలితంగా 1947 ఆగస్టు 15 న నిర్మించబడినది. స్వాతంత్ర్యోద్యమ స్మారక చిహ్నమే ఈ గడియార స్తంభం. బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుంచి భారతీయుల విముక్తి పొందిన రోజున ఈ గడియర స్తంభాన్ని నిర్మించారు.

గడియార స్తంభం నిర్మాణం మార్చు

నాలుగు ముఖాలు కనిపిస్తున్నా అష్ట భుజాలతో 47 అడుగుల ఎత్తు ,15 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదిని, అష్ట భుజాలు 8వ నెలను, 47అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని స్పుర్తించేలా దీన్ని నిర్మించడం విశేషం .

ఇతర విషయాలు మార్చు

1945 లోనే కేబినేట్ మిషన్ భారత్ లో పర్యటించినపుడు అనంతపురంలో కూడా పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. 1945 లోనే జిల్లాల్లోని ప్రజలు దాదాపు రూ.30 వేలు వసూలు చేసారు. ఆ నిధులతొనే నిర్మించారు.అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైనది. టవర్ క్లాక్ కు రెండు శిలా ఫలకాలను ఏర్పటు చేశారు. ఒక దాంట్లొ ప్రారంభోత్సవ వివరాలు , మరో శిలాఫలకం పై విరళాలు అందజేసిన వారి పేర్లున్నాయి.[1]

మూలాలు మార్చు