ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. ఈ రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపికచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తోంది. నియామకానికి తగిన నియమాలను రూపొందించడం, పదోన్నతులపై సలహా ఇవ్వడం, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైనవి ఈ సంస్థ కార్యకలాపాలు.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
సంకేతాక్షరంఏపీపీఎస్సీ
స్థాపన1956
రకంరాజ్యాంగ సంస్థ
కేంద్రీకరణప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ప్రధాన
కార్యాలయాలు
విజయవాడ ఆంధ్రప్రదేశ్
కార్యస్థానం
  • ఏపీపీఎస్సీ కార్యాలయం,ఎంజీ రోడ్డు (బందర్ రోడ్డు), విజయవాడ-520 010 ఆంధ్రప్రదేశ్.
సేవా ప్రాంతాలుఆంధ్రప్రదేశ్
చైర్మన్దామోదర్ గౌతమ్ సవాంగ్

విధులు మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎన్నుకోవడం కమిషన్ ప్రాధమిక విధులలో ఒకటి. కమిషన్ ముఖ్యమైన చట్టబద్ధమైన విధులు.

  • ప్రత్యక్ష నియామకం
  • రాష్ట్ర, సబార్డినేట్ సేవలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనల ఆమోదం
  • ప్రత్యేక కేసులలో కారుణ్య నియామకాలకు సమ్మతి
  • బదిలీ/ప్రమోషన్ ద్వారా నియామకం
  • క్రమశిక్షణా కేసులు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించడం
  • అర్థ వార్షిక పరీక్షలు
  • తాత్కాలిక నియామకాలు - కమిషన్ సమ్మతి

చైర్మన్లు మార్చు

  • జాగర్లమూడి వీరాస్వామి
  • పిన్నమనేని ఉదయ్ భాస్కర్ (27 నవంబర్ 2015 - 2021)[1][2]
  • ఏవీ రమణారెడ్డి - ఇన్‌చార్జి చైర్మన్‌ (2021 డిసెంబర్ 21 నుండి ప్రస్తుతం)[3][4]
  • దామోదర్ గౌతమ్ సవాంగ్ భాద్యతలు స్వీకరించాల్సి ఉంది[5]

మూలాలు మార్చు

  1. Sakshi (27 November 2015). "ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉదయ భాస్కర్". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  2. The Hindu (26 November 2015). "Uday Bhaskar new APPSC Chairman" (in Indian English). Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జూన్ 2018 suggested (help)
  3. Andhra Jyothy (21 December 2021). "ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణా రెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  4. Sakshi (21 December 2021). "ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  5. Eenadu (17 February 2022). "ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.

బయటి లింకులు మార్చు