ఆర్. బాలాజీ రావు

భారతీయ ఉద్యమకారుడు మరియు రాజకీయవేత్త

ఆర్. బాలాజీ రావు (1842-1896) తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. మద్రాస్ మహాజన సభ వ్యవస్థాపకుడు, మొదటి కార్యదర్శి.[1]

ఆర్. బాలాజీ రావు
జననం1842
మరణం1896
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు

వ్యక్తిగత జీవితం మార్చు

బాలాజీ రావు 1842 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని మరాఠీ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[2][3] తంజావూరు, మద్రాసులలో పాఠశాల విద్యను పూర్తిచేశాడు. అటు తరువాత న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసాడు.[4]

రాజకీయాలు మార్చు

రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలాజీ రావు మద్రాస్ మహాజన సభ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[1] ఎస్.ఎ. సామినాథ అయ్యర్‌తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సెషన్‌లో తంజావూరుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]

మరణం మార్చు

బాలాజీ రావు 1896లో మరణించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 P. Yanadi Raju (2003). Rayalaseema during colonial times: a study in Indian nationalism. Northern Book Centre. p. 139. ISBN 8172111398.
  2. John Jeya Paul (1991). The legal profession in colonial South India. Oxford University Press. p. 220. ISBN 978-0195625585. R. Balaji Rao, a Desastha Brahman and a family friend from Tanjore, under whom they apprenticed;
  3. R. Suntharalingam (1974). Politics and nationalist awakening in South India, 1852-1891. University of Arizona Press. pp. 352. ISBN 0816504474.
  4. John Jeya Paul (1991). The legal profession in colonial South India. Oxford University Press. pp. 220. ISBN 0195625587.