ఉద్యోగ పర్వము
ఉద్యోగ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఐదవ పర్వము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
దస్త్రం:Krishna and Pandavasa meet Sanjaya.jpg
పాడవులు కౌరవులతో తమ రాజ్యం యివ్వాలని చర్చిస్తున్న దృశ్యం. యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం.
ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. సంస్కృత మూలంలో 6, 698 శ్లోకాలు ఉన్నాయి. సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు) . దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు.
సంస్కృత మహాభారతంసవరించు
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౧౧ ఉప పర్వాలు ఉద్యోగ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- ఉద్యోగం
- సంజయయానం
- ధృతరాష్ట్ర ప్రజాగరణం
- సానత్సుజాతం
- యానసంధి
- శ్రీకృష్ణరాయబారం
- సేనానిర్యాత్రా పర్వం
- ఉలూకదూతాభిగమనం
- సమరథ-అతిరథ సంఖ్యానం
- కర్ణభీష్మ వివాదం
- అంబోపాఖ్యానం