ఎ.నారాయణస్వామి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2019లో తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై 7 జులై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

ఎ. నారాయణస్వామి

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రతన్ లాల్ కటారియా

రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
23 సెప్టెంబర్ 2010 – 13 మే 2013

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు బి.ఎన్. చంద్రప్ప
నియోజకవర్గం చిత్రదుర్గ

శాసనసభ్యుడు
పదవీ కాలం
1998 – 2013
ముందు వై. రామకృష్ణ
తరువాత బి. శివన్న
నియోజకవర్గం అనేకల్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-16) 1957 మే 16 (వయసు 66)
అనేకల్, బెంగుళూరు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి టీ. విజయ కుమారి

రాజకీయ జీవితం మార్చు

ఎ.నారాయణస్వామి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999,2004, 2008లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చిత్రదుర్గ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై 30 మే 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

మూలాలు మార్చు

  1. Lok Sabha (2021). "A. Narayana Swamy". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  3. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.