కపిలవాయి కాశీ రామారావు

కపిలవాయి కాశీ రామారావు దాత, వ్యాపార దక్షుడు, గుంటూరు జిల్లా సామాజిక కార్యకర్త. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు.

జీవిత విశేషాలు మార్చు

కపిలవాయి కాశీరామారావు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి మండలానికి చెందిన పెదగార్లపాడు గ్రామంలో 1921లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు నరసయ్య, లక్ష్మీనరసమ్మలు. 1939 లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చేరి వివిధ స్థాయిలలో పదవులు నిర్వహించాడు. మూఢ నమ్మకాలు తొలగనిదే సంఘం అభివృద్ధి చెందదని నమ్మేవాడు. పరోపకారం కోసం చేసిన వాగ్దానాలను నిలుపుకొనేవాడు. సహకార రంగంలో పాలుపంచుకొని, దాని అభివృద్ధికి తోడ్పడ్డాడు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి కృషిచేశారు. శ్రీశైలం, కోటప్ప కొండ దేవాలయాల ట్రస్టు బోర్డు సభ్యులుగా పనిచేశాడు.

మూలాలు మార్చు