కర్రి పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు గవర్నర్ కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1][2]

కర్రి పద్మ శ్రీ

పదవీ కాలం
11 ఆగష్టు 2023 – 09 ఆగష్టు 2029
నియోజకవర్గం గవర్నర్ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 17 జూన్ 1976
కాకినాడ , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
జీవిత భాగస్వామి కర్రి నారాయణ రావు
సంతానం శ్రీ శ్రెయిన, శ్రీ శ్రియన
నివాసం జగన్నాథపురం, కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త
మతం హిందువు

రాజకీయ జీవితం మార్చు

కర్రి పద్మశ్రీ జాతీయ మత్య్సకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[3] ఆమెను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు గవర్నర్ కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా, ఆగష్టు 09న ఎమ్మెల్సీ నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశాడు.[4][5]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. 10TV Telugu (20 February 2023). "ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాల విడుదల.. అధికార పార్టీ అభ్యర్థులు వీరే". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (21 February 2023). "పెద్దల సభకు ముగ్గురు". Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.
  4. Andhrajyothy (11 August 2023). "గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.
  5. Sakshi (11 August 2023). "ఎమ్మెల్సీగా కర్రి పద్మశ్రీ". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.