ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభ.[1] 1958 నుండి 1985 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2007 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరల ఉనికిలోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కొనసాగుతున్నది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి | |
---|---|
రకం | |
రకం | ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ ఎగువ సభ |
కాల పరిమితులు | 6 సంవత్సరాలు |
నాయకత్వం | |
అధ్యక్షుడు | |
అధికారపక్ష నాయకుడు | ఖాళీ, YSRCP |
ప్రతిపక్ష నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 58 (50 Elected + 8 Nominated) |
![]() | |
రాజకీయ వర్గాలు | అధికార పక్షం లేక జట్టు (13)
ప్రధాన ప్రతిపక్షం లేక జట్టు (29)
ఇతరులు(11) ఖాళీ (5)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | Single transferable vote |
సమావేశ స్థలం | |
![]() | |
శాసనమండలి భవనం అమరావతి, ఆంధ్రప్రదేశ్ | |
వెబ్సైటు | |
http://www.aplegislature.org/web/legislative-council |
చరిత్రసవరించు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసింది. 1956 డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటు చేయుటకు తీర్మానం చేసింది. ఈ వ్యవస్థ మూలంగా రెండు సభలు ఉంటాయి.[2] అధికారికంగా విధాన పరిషత్తు 1958 జూలై 1 న ప్రారంభించబడింది. ఈ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా జరిగింది. 1968 జూలై 8 న అప్పటి భారత రాష్ట్రపతి, రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేసాడు.[2]
రద్దులు, పునరుజ్జీవనాలుసవరించు
1985 రద్దుసవరించు
1980 వ దశకంలో, ఎగువ సభలను రద్దు చేయాలని కోరే రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వుంది. ఇది జనాభా ప్రాతినిధ్యం లేనిదని, రాష్ట్ర బడ్జెట్ పై భారమని, చట్టం ఆమోదించడంలో జాప్యాలకు కారణమనే విమర్శలతో రద్దు కోరబడింది.[2][3][4][5] ఏదేమైనా అప్పటి పాలక పార్టీ తెలుగుదేశం రాజకీయ ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెస్కు శాసన మండలిలో ఎక్కువ సీట్లు ఉండటంవల్ల చట్టాన్ని ఆలస్యం జరిగింది.[5]
ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించిన తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (నిర్మూలన) చట్టం ద్వారా విధాన పరిషత్ను రద్దు చేసింది.
2007 పునరుజ్జీవనముసవరించు
1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) కు చెందిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శాసన మండలిని పునరుద్ధరించడానికి తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాడు.[2][5] శాసన మండలిని పునరుద్ధరించడానికి ఒక తీర్మానం 1990 జనవరి 22 న విధానసభలో ఆమోదించబడింది.[2]
1990 మే 28 న రాష్ట్ర విధానసభ తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ)లో శాసన మండలి యొక్క పునరుద్ధరణకు అధికారమిచ్చిన శాసనం ఆమోదం పొందింది కానీ అర్ధంతరంగా 1991 లో లోక్సభ రద్దు కావటంతో నిలిచిపోయింది.[2] తరువాత వచ్చిన లోక్సభలు (1991–1996, 1996–1998, 1998–2004) ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
2004 రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ జూలై 8, 2004 న శాసన మండలి పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని ఆమోదించింది.[2] ఇది 2004 డిసెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్గా లోక్సభలో ప్రవేశపెట్టబడింది. 2006 డిసెంబరు 15 న లోక్సభ శాసనసభ ఆమోదం, డిసెంబరు 20 న రాజ్యసభ ఆమోదం పొంది, 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది.[2] నూతనంగా పునరుద్ధరించబడిన శాసన మండలి 2007 మార్చి 30 న ఏర్పాటు చేయబడింది, ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ చేత ప్రారంభించబడింది.[2]
2020 రద్దు ప్రయత్నంసవరించు
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను శాసనసభ ఆమోదం తర్వాత, శాసనమండలి ఎంపికచేసిన శాసనమండలి సభ్యుల సభకు నిశిత పరిశీలనకొరకు పంపాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వం శాసనసభలో శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పై చర్చకు తెదేపా హాజరుకాలేదు. జనసేన శాసనసభ్యుడు అంగీకారం తెలపటంతో 133-0 ఆధిక్యంతో ఆమోదం పొందింది. 2020-01-28 నాటికి [update] , ఈ బిల్లు కేంద్రం మంత్రి మండలి ముందుకు వచ్చింది.[6]
హోదా, ప్రస్తుత సభ్యులుసవరించు
కౌన్సిల్ చేత ఎన్నుకోబడిన చైర్పర్సన్, కౌన్సిల్ యొక్క సెషన్లకు అధ్యక్షత వహిస్తారు. చైర్పర్సన్ అందుబాటులోకి లేని సమయంలో సభను నిర్వహించడానికి డిప్యూటీ చైర్పర్సన్ ను కూడా ఎన్నుకుంటారు.
సభ్యత్వం , పదవీకాలంసవరించు
శాసన మండలి శాశ్వత సభ.[2] ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరుసంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు.[2] శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.
20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 10 మంది సభ్యులు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు . ఆంధ్రప్రదేశ్ గవర్నరు ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. [7]
శాసన మండలి సభ్యులుసవరించు
శాసనసభ్యులుసవరించు
సీటు సంఖ్య | పేరు | ఎన్నికైన పార్టీ | కాలం |
---|---|---|---|
01 | యనమల రామకృష్ణుడు | తె.దే.పా | 2019 - 2025 |
02 | పర్చూరి అశోక్ బాబు | తె.దే.పా | 2019 - 2025 |
03 | దువ్వారపు రామారావు | తె.దే.పా | 2019 - 2025 |
04 | బి తిరుమల నాయుడు | తె.దే.పా | 2019 - 2025 |
05 | వట్టికూటి వీరవెంకన్న చౌదరి | తె.దే.పా | 2019 - 2025 |
06 | దేవసాని చిన్నగోవిందరెడ్డి | వై.ఎస్.ఆర్.కా.పా | 2015 - 2021 |
07 | షేక్ మహమ్మద్ ఇక్బాల్ | వై.ఎస్.ఆర్.కా.పా | 2015 - 2021 |
08 | పివివి సూర్యనారాయణ రాజు | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 |
09 | వట్టికూటి వీర వెంకన్న చౌదరి | తె.దే.పా | 2015 - 2021 |
10 | మహ్మద్ అహ్మద్ షరీఫ్ | తె.దే.పా | 2015 - 2021 |
11 | సోము వీర్రాజు | బి.జె.పి | 2015 - 2021 |
12 | నారా లోకేశ్ | తె.దే.పా | 2017 - 2023 |
13 | గంగుల ప్రభాకరరెడ్డి | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 |
14 | ఆళ్ల నాని | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 |
15 | జంగా కృష్ణమూర్తి | వై.ఎస్.ఆర్.కా.పా | 2019 - 2025 |
16 | పోతుల సునీత | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023[8] |
17 | బచ్చుల అర్జునుడు | తె.దే.పా | 2017 - 2023 |
18 | డొక్కా మాణిక్యవరప్రసాద్ | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023[9] |
19 | 2017 - 2023 | ||
20 | 2015 - 2021 |
స్థానిక సంస్థలుసవరించు
సీటు సంఖ్య | జిల్లా | పేరు | ఎన్నికైన పార్టీ | కాలం |
---|---|---|---|---|
01 | అనంతపురం | 2015 - 2021 | ||
02 | చిత్తూరు | గాలి సరస్వతి | తె.దే.పా | 2015 - 2021 |
03 | తూర్పు గోదావరి | చిక్కాల రామచంద్ర | తె.దే.పా | 2017 - 2023 |
04 | గుంటూరు | అన్నం సతీష్ ప్రభాకర్ | తె.దే.పా | 2015 - 2021 |
05 | కృష్ణా | యై.వి.బాపు రాజేంద్రప్రసాద్ | తె.దే.పా | 2015 - 2021 |
06 | కృష్ణా | బుద్దా వెంకటేశ్వరరావు | తె.దే.పా | 2015 - 2021 |
07 | ప్రకాశం | 2015 - 2021 | ||
08 | విశాఖపట్నం | ఎం.వి.వి.ఎస్. మూర్తి | తె.దే.పా | 2015 - 2021 |
09 | విజయనగరం | ద్వారపురెడ్డి జగదీశ్వరరావు | తె.దే.పా | 2015 - 2021 |
10 | విజయనగరం | పప్పల చలపతిరావు | తె.దే.పా | 2015 - 2021 |
11 | పశ్చిమ గోదావరి | అంగర రామమోహన్ | తె.దే.పా | 2015 - 2021 |
12 | అనంతపురం | గూనపాటి దీపక్రెడ్డి | తె.దే.పా | 2017 - 2023 |
13 | చిత్తూరు | బి.ఎన్.రాజసింహులు | తె.దే.పా | 2017 - 2023 |
14 | గుంటూరు | 2015 - 2021 | ||
15 | గుంటూరు | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 |
16 | కడప | మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి | తె.దే.పా | 2017 - 2023 |
17 | కర్నూలు | కె.ఇ.ప్రభాకర్ [10] | తె.దే.పా | 2018 - 2023 |
18 | నెల్లూరు | వాకాటి నారాయణరెడ్డి | తె.దే.పా | 2017 - 2023 |
19 | శ్రీకాకుళం | శత్రుచర్ల విజయరామరాజు | తె.దే.పా | 2017 - 2023 |
20 | పశ్చిమ గోదావరి | మంతెన వెంకట సత్యనారాయణ రాజు | తె.దే.పా | 2017 - 2023 |
పట్టభద్రులుసవరించు
సీటు సంఖ్య | జిల్లా | పేరు | ఎన్నికైన పార్టీ | కాలం |
---|---|---|---|---|
01 | పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి | ఇల్లా వెంకటేశ్వరరావు | పి.డి.ఎఫ్ | 2019 - 2025 |
02 | కృష్ణా జిల్లా, గుంటూరు | కలగర సాయి లక్ష్మణరావు | పి.డి.ఎఫ్ | 2019 - 2025 |
03 | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | పి.వి.ఎన్.మాధవ్ | బి.జె.పి | 2017 - 2023 |
04 | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | యండపల్లి శ్రీనివాసులరెడ్డి | పి.డి.ఎఫ్ | 2019 - 2025 |
05 | అనంతపురం, కర్నూలు, కడప | వెన్నపూస గోపాలరెడ్డి | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 |
ఉపాధ్యాయులుసవరించు
సీటు సంఖ్య | జిల్లా | పేరు | ఎన్నికైన పార్టీ | కాలం |
---|---|---|---|---|
01 | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | పాకలపాటి రఘువర్మ | స్వతంత్ర | 2019 - 2025 |
02 | పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి | రాము సూర్యారావు | పి.డి.ఎఫ్ | 2015 - 2021 |
03 | కృష్ణా జిల్లా, గుంటూరు | ఎ.ఎస్.రామకృష్ణ | స్వతంత్ర | 2015 - 2021 |
04 | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | విటపు బాలసుబ్రహ్మణ్యం | పి.డి.ఎఫ్ | 2017 - 2023 |
05 | అనంతపురం, కర్నూలు, కడప | కత్తి నరసింహారెడ్డి | స్వతంత్ర | 2017 - 2023 |
నామినేటెడ్సవరించు
సీటు సంఖ్య | పేరు | ఎన్నికైన పార్టీ | కాలం |
---|---|---|---|
01 | పాండుల రవీంద్రబాబు | వై.ఎస్.ఆర్.కా.పా | 2020 - 2026 |
02 | జకియా ఖానుం | వై.ఎస్.ఆర్.కా.పా | 2020 - 2026 |
03 | సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి | తె.దే.పా | 2015 - 2021 |
04 | గౌనివారి శ్రీనివాసులు | తె.దే.పా | 2015 - 2021 |
05 | బీడ రవిచంద్ర | తె.దే.పా | 2015 - 2021 |
06 | టి.డి.జనార్థన్ | తె.దే.పా | 2015 - 2021 |
07 | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | తె.దే.పా | 2017 - 2023 |
08 | పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి | తె.దే.పా | 2017 - 2023 |
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "legislative council, Andhrapradesh". AP Government. Retrieved 11 June 2019.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 "Andhra Pradesh Legislative Council History". National Informatics Centre. Retrieved 2010-09-03.
- ↑ Sharma. Introduction to the Constitution of India, Fifth Edition. PHI Learning Pvt. Ltd. pp. 212–13. ISBN 978-81-203-3674-2.
- ↑ Laxmikanth. Indian Polity For UPSC 3E. Tata McGraw-Hill. pp. 27–1. ISBN 978-0-07-015316-5.
- ↑ 5.0 5.1 5.2 Agarala Easwara Reddy (1994). State politics in India: reflections on Andhra Pradesh. M.D. Publications Pvt. Ltd. pp. 97–110. ISBN 978-81-85880-51-8.
- ↑ "శాసనమండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం". జీన్యూస్. 2020-01-28. Retrieved 2021-01-25.
- ↑ TMH General Knowledge Manual. Tata McGraw. 2007. p. 176. ISBN 978-0-07-061999-9.
- ↑ "ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం". సాక్షి. 20201-01-19. Retrieved 2021-01-24. Check date values in:
|date=
(help) - ↑ "ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక ఏకగ్రీవం". సమయం. 2020-06-25. Retrieved 2021-01-24.
- ↑ "TDPs Prabhakar elected unopposed to AP Legislative Council". India today. 2017-12-29. Retrieved 2021-01-25.