యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ద్వారా ముందుకు తేబడింది [1]. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు[2].
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | |
---|---|
![]() | |
Chairman | వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి |
స్థాపన | మార్చి 11, 2011 |
సిద్ధాంతం | ప్రాంతీయతావాదం |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 151 / 175 |
తెలంగాణా అసెంబ్లీ | 0 / 119 |
లోక్ సభ | 22 / 545 |
రాజ్య సభ | 2 / 245 |
ఓటు గుర్తు | |
![]() | |
వెబ్ సిటు | |
www |
ఎన్నికలుసవరించు
2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.స్వల్ప తేడాతో ఓడి పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకి బాగా చేరువ అయింది. ప్రత్యేక హోదాపై అలుపెరుగని పోరాటం చేయడమే కాక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య నుంచే ఎండగట్టింది. 2019 ఎన్నికలలో కేవలం ఆంధ్రప్రదేశ్ పై దృష్టిపెట్టి, ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను 151 స్థానాలతో, భారత లోకసభలో 22 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను అత్యున్నత ఫలితాలు అందుకుంది.
శాసనసభ ఫలితాలు
సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతము | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|
2014 | 14వ శాసనసభ | 67 / 175 |
44.47 % | ఓటమి | [3] |
2019 | 15వ శాసనసభ | 151 / 175 |
50 % | విజేత |
లోక్ సభ ఫలితాలు
సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు |
---|---|---|
2014 | 16వ లోక్ సభ | 8 / 25 |
2019 | 17వ లోక్ సభ | 22 / 25 |
వాగ్ధాన పత్రముసవరించు
వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.[4][5] జనాకర్షక పథకాలలో కొన్ని:[6]
- రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
- రైతులకు,కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
- రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
- రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
- ఆక్వా రైతులకు యూనిట్ రూపాయికే విద్యుత్
- రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
- ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
- కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
- వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
- మూడు దశల్లో మద్యపాన నిషేధం
- ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ
- ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నియామకాలు అతి స్వల్ప కాలంలో భర్తీ
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "Jaganmohan Reddy acquires YSR Congress Party from worker". 2011-02-17. మూలం నుండి 2019-06-14 న ఆర్కైవు చేసారు. Cite web requires
|website=
(help) - ↑ "Jagan is national president of YSR Congress Party". 2011-02-22. Cite web requires
|website=
(help) - ↑ "TDP vs YSRC: Small margin, big difference in Seemandhra". Deccan Chronicle. 2014-05-18. మూలం నుండి 2014-05-18 న ఆర్కైవు చేసారు. Cite web requires
|website=
(help) - ↑ "వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్.. ప్రధాన అంశాలివే..!". ఆంధ్రజ్యోతి. 6 Apr 2019. మూలం నుండి 7 Apr 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 Apr 2019.
- ↑ "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019" (PDF). YSRCP. మూలం (PDF) నుండి 2019-04-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-04-07. Cite web requires
|website=
(help) - ↑ "YS Jagan Manifesto: పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు.. వైసీపీ మేనిఫెస్టో ఇదే". Samayam. మూలం నుండి 7 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 April 2019. Cite news requires
|newspaper=
(help)
ఇతర లింకులుసవరించు
Wikimedia Commons has media related to YSR Congress Party. |