తెలుగు రచయిత చందాల కేశవదాసు గురించిన వ్యాసం ఇక్కడ చూడండి.

కేశవదాసు చిత్రపటం, circa 1570.

కేశావదాసు మిశ్రా(1555 – 1617)[1] సంస్కృత పండితుడు, హిందీ భాషా రచయిత, కవి. అతను రసికప్రియ అను హిందీ శృంగార కావ్యమును రచించెను.

జీవిత విశేషాలు మార్చు

కేశవదాసుడు బుందేల్ఖండ్ అను గ్రామ వాసి. ఈ గ్రామం ప్రస్తుతము ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో విస్తరించి ఉంది. రాజా మధుకరషా ఇతనికి ఆస్థానమున ఆశ్రయమిచ్చి సన్మానించెను.[2] మధుకరుని అనంతరము అతని ఆసనమును అధిష్ఠించిన అతని కుమారుడు ఆంధ్రజిత్తుషా ఇతని పాండితికి మెచ్చి 21 గ్రామాలను బహుమతిగా ఇచ్చెను.

కేశవదాసు రచనలలో రెండవది ఈ రసికప్రియ. ఇది సుమారు సా.శ. 1591 సం. రచింపబడింది. దీని తరువాతి రచన 'కవిప్రియ' అను అలంకార గ్రంథము. అది సా.శ. 1601 సం. నాటిది. హిందీ భాషయందు గల ప్రేమకావ్యములలో ఈ రసికప్రియకు చక్కని పేరు గలదు. 17, 18 వ శతాబ్దములనాటి పహారీ చిత్రములు చాలా వరకు ఈ కావ్యమును అధారపడినవే. ఆ చిత్రములలో చాలావరకు అడుగు భాగమునను, కొన్ని వెనుక వైపున ఇతని పద్యములు రచింపబడినవి.ఒకప్పుడు అక్బరుచక్రవర్తి ఇద్రజిత్తుషాకు అవిధేయతగా 10 మిలియనుల రూపాయలు అపరాధమును విధించెను. ఆసందర్భమున కేశవదాసు అక్బరు అస్ఠానమునకు బయలుదేరి, అక్బరు మంత్రి వీరబలుని తో ఈ విషయమై రహస్యముగా మంతనమాడి ఈ రసికప్రియను ఆతనికి వినిపించెను. వీరబలుడు ఆతని పాండిత్యానికి మెచ్చి ఈ అపరాధమును రద్దు చేయించెను. రసికప్రియ 16 అధ్యాయముల కావ్యము. అందు ద్వితీయ, తృతీయ, సత్పమాధ్యాయములు బాగా ప్రాచుర్యము పొందినవి. నాయక లక్షణములను ద్వితీయాధ్యాయమునునందు, తృతీయాధ్యాయమునందు నాయికా లక్షణములను, అష్టానయికావర్ణన సప్తమాధ్యాయమునందు వివరించెను. ఈ పహారీ చిత్రములందు చాలావరకు రాధా, కృష్ణులే నాయికా, నాయకులుగా చిత్రింపబడినవి. ఈ పహారీ చిత్రములు "The Journal of Indian Art" లో చాలా వరకు వర్ణింపబడినవి.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Shackle (1996), p. 214
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2014-04-02.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కేశవదాసు&oldid=3943179" నుండి వెలికితీశారు