కోరుకొండ

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండల గ్రామం

కోరుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

కోరుకొండ
—  రెవెన్యూ గ్రామం  —

[[Image:thumb|కోరుకొండ|250px|none|]]

కోరుకొండ is located in Andhra Pradesh
కోరుకొండ
కోరుకొండ
అక్షాంశరేఖాంశాలు: 17°10′18″N 81°49′54″E / 17.171627°N 81.831551°E / 17.171627; 81.831551
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కోరుకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,012
 - పురుషులు 2,761
 - స్త్రీలు 2,251
 - గృహాల సంఖ్య 1,222
పిన్ కోడ్ 533 289
ఎస్.టి.డి కోడ్

జనాభా మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2721 ఇళ్లతో, 9228 జనాభాతో 650 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4609, ఆడవారి సంఖ్య 4619. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 938 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 271. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587380[1].పిన్ కోడ్: 533289.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,462.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,275, మహిళల సంఖ్య 4,187, గ్రామంలో నివాసగృహాలు 2,112 ఉన్నాయి.

చరిత్ర మార్చు

సురవరం ప్రతాప రెడ్డి రచించిన అంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంథం ప్రకారం .......

కోరుకొండలో రాజ్యంచేసిన ముమ్మడినాయకుని రాజ్యంలో కోనసీమ, అంగరసీమ, కొఠామసీమ, కురవాటసీమ చాంగలునాటిసీమ మొదలగు సీమలు ఉన్నట్లుగా వివరించబడింది..ఇవన్నియూ గౌతమీనది కిరుప్రక్కల వ్యాపించి ఉన్నవి.ఈ రాజ్యంలో అరటి, కొబ్బరి, పనస, పోక, మామిడి మొదలగు తోటలతే రమ్యమై ఆంధ్రభూమిన ప్రసిద్ధిగా నున్నదని యార్యవట శాసనంలో వర్ణింపబడినది.1 "శ్రీశైల పూర్వనికటమునుండి పూర్వ సముద్రముదాక ప్రవహించుకుండి తరంగిణి యను గుండ్లకమ్మనది కిరుపక్కలనుండు సీమకే పూంగినాడను నామము కలదని తెలుస్తుంది.[3]

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల  ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల రాజానగరంలో ఉంది. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్‌ రాజమహేంద్రవరంలోను, మేనేజిమెంటు కళాశాల బూరుగుపూడిలోనూ ఉన్నాయి.సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరంలో ఉంది.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

కోరుకొండలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

కోరుకొండలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

కోరుకొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 247 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 12 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1 హెక్టార్లు
  • బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 384 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 48 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 341 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

కోరుకొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 21 హెక్టార్లు
  • చెరువులు: 319 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

కోరుకొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, చెరకు

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు మార్చు

ఇక్కడ ప్రసిద్ధ మైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది.120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువుగా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభము ఉంది. ఈ దేవాలయాన్ని వైష్ఠవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు.

పురాతన, చారిత్రక ఆలయ విశేషాలు మార్చు

ఈ గుడి, కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 సా.శ.లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. శ్రీనాథ కవిసార్వభౌముడు తన కవితాసంపుటంలో కోరుకొండను వేదాద్రిగా వర్ణించాడు. దీనికి సంబంధించిన సా.శ. 1443 చెందిన శిలాశాసనాలు నరసాపురం తాలుకా లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్నాయి.

ప్రత్వేక ఉత్సవాలు జరిగే సందర్భాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-01.
  3. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/115

బయటి లింకులు మార్చు

  • తూర్పు గోదావరి జిల్లా వెబ్ సైటులో కోరుకొండ గురించి [1]
  • రాజమండ్రి వెబ్ సైటులో కోరుకొండ గురించి [2]
"https://te.wikipedia.org/w/index.php?title=కోరుకొండ&oldid=4125708" నుండి వెలికితీశారు