ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)

ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది.
(ఖమ్మం కోట నుండి దారిమార్పు చెందింది)

ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది. ఈ కోట 300 సంవత్సరాల పాటు కాకతీయ రెడ్డి రాజుల ఆధీనంలో ఉంది. అప్పటి కాకతీయ రాజుల సైన్యాధిపతుల మధ్య విభేదాల కారణంగా, ఈ కోట పద్మనాయక వంశం (వెలమ రాజులు) చేతుల్లోకి వెళ్లింది, కొంతకాలం తర్వాత నందవాణి, కల్లూరు, గుడ్లూరు రాజులు వంటి వివిధ స్వతంత్ర పాలకులచే పాలించబడింది. ఆ తరువాత వచ్చిన ముసునూరి కమ్మరాజులు, కుతుబ్ షాహీ వంశస్థులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు.[1][2]

Khammam Fort
Stambhadri Hills లో భాగం
Khammam, Telangana, India
Khammam Fort is located in Telangana
Khammam Fort
Khammam Fort
Location in Telangana
భౌగోళిక స్థితి17°14′43″N 80°08′48″E / 17.24528°N 80.14667°E / 17.24528; 80.14667
రకముHill Fort
ఎత్తు867 metres (2,844 ft)
స్థల సమాచారం
హక్కుదారుGovernment of India
నియంత్రణMusunuri Nayaks 1210 A. D. - 1369 A. D.

Gurijala Nayaks 1369 A. D. - 1433 A. D. Independent rulers 1512 A. D. -1515 A.D Sri Krishnadevaraya of Tuluva Dynasty 1515 A.D for a brief period Qutb Shahi dynasty 1518 A.D - 1687 A.D Mughal Empire 1687 A.D - 1707 A.D Asaf Jahi Dynasty 1707 A.D-1948 A.D

 India (1948 - Till date)
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిYes
పరిస్థితిDeclared Protected Monument by Archaeological Survey of India in 2005. Mostly Destroyed.
స్థల చరిత్ర
కట్టించిందిMusunuri Nayaks
వాడుకలో ఉందాTourism
వాడిన వస్తువులుStone, Limestone mortar
Battles/warsMusunuri Nayaks, Gurijala Nayaks, Qutub Shahis, Aurangazeb, Sri Krishnadevaraya and Local Rulers
EventsStambhadri Sambaralu,1000 Year Celebrations of Khammam Khilla
Garrison information
OccupantsMusunuri Nayaks - 1210 A. D. - 1369 A. D.

Gurijala Nayaks 1369 A. D. - 1433 A. D. Krishna Deva Raya of Tuluva Dynasty, Shitab Khan - 1515 A.D - 1518 A.D Qutb Shahi dynasty- 1518 A.D - 1687 A.D Aurangazeb of the Mughal Empire - 1687 A.D - 1707 A.D

Asaf Jahi Dynasty - 1707–1948 A.D
కోట గోడ

సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ లాగ అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది.

గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు పది ద్వారాలున్నాయి. పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహలు ఉన్నాయి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. S.Ravi (2023-05-30). "13th Century Khammam Fort in Telangana being spruced up to woo tourists". Indianarrative (in ఇంగ్లీష్). Retrieved 2023-10-05.
  2. "కాకతీయుల ఖమ్మం కోట తెలంగాణ,Khammam Fort Of Kakatiyas -" (in English). 2023-01-25. Retrieved 2023-10-05.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు