ఖమ్మం
ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.[4] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [5] ఖమ్మం పట్టణం వ్యాపార, ఆర్థిక కేంద్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దాదాపు 193 కిలోమీటర్లు (120 మై.), సూర్యాపేట నుండి 61 కిలోమీటర్లు (38 మై.), వరంగల్ నుండి 120 కిలోమీటర్లు (75 మై.), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఉత్తరాన దాదాపు 121 కిలోమీటర్లు (75 మై.) దూరంలో ఉంది. మున్నేరు నది ఈ నగరానికి పడమటి వైపున ప్రవహిస్తోంది.[6] 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం , ఖమ్మం పట్టణ సముదాయంలో 313,504 జనాభా ఉంది.[2] 2012, అక్టోబరు 19న, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్గా అప్గ్రేడ్ చేయబడింది. కార్పోరేషన్గా అప్గ్రేడ్ చేయబడిన తరువాత ఖమ్మం జనాభా సుమారు 3,07,000 గా ఉంది.[7]
ఖమ్మం ఖమ్మమెట్ట్ | |
---|---|
నగరం | |
![]() నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణం | |
నిర్దేశాంకాలు: 17°15′N 80°10′E / 17.25°N 80.16°ECoordinates: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
ప్రభుత్వం | |
• నిర్వహణ | ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ |
• మేయర్ | పూనుకొల్లు నీరజ |
• డిప్యూటీ మేయర్ | షేక్ ఫాతిమా జోహారా |
• మున్సిపల్ కమీషనర్ | సందీప్ కుమార్ |
• శాసనసభ్యుడు | పువ్వాడ అజయ్ కుమార్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 93.45 km2 (36.08 sq mi) |
విస్తీర్ణపు ర్యాంకు | 3వ (రాష్ట్రంలో) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 107 మీ (351 అ.) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 3,13,504 |
• ర్యాంకు | 151 (దేశం) 4 (రాష్ట్రం) |
• సాంద్రత | 3,400/km2 (8,700/sq mi) |
పిలువబడువిధం (ఏక) | ఖమ్మమైట్ |
అధికారక | |
• భాష | తెలుగు, ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 507001 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టిఎస్–04[3] |
జాతీయత | భారతీయులు |
ప్రణాళికా సంస్థ | ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ |
జాలస్థలి | manakmc |
పద చరిత్రసవరించు
ఖమ్మం నిజనామం కమ్మమెట్టు". తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది[8][9][10][11][12][13]. ఈ పేరును "కమోమెట్", "ఖమ్మమ్మెట్" అని కూడా ఆంగ్లీకరించారు.[14]
చరిత్రసవరించు
తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాచర్ల దొరలూ, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉంది 1905 దాకా వరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ గా పేర్కొనబడినది .[15]
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.
భౌగోళికంసవరించు
ఖమ్మం భౌగౌళికంగా 17.25° ఉ 80.15° తూలో ఉంది. దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణం అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగా సాగర్ నీరు లభించింది.
ఖమ్మం జిల్లాలోని నేల ఎక్కువగా గోదావరి నదికి దక్షిణాన ఇసుక నేలలు, మధిర మండలంలో నల్లమట్టి, గోదావరి నదిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు గోదావరి డెల్టా భూముల వలె సారవంతమైనవిగా ఉన్నాయి. జిల్లాలో ప్రధాన నేల చలక (43%), దుబ్బ (28%), నల్లమట్టి (29%). అటవీ సంపదలో ప్రధానంగా టేకు, నల్లమద్ది, చంద్ర, వెదురు ఉన్నాయి. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 4% అటవీ విస్తీర్ణంలో, మొత్తం అటవీ విస్తీర్ణం 7,59,438 హెక్టార్లు. జిల్లాలోని వృక్షలలో కలప, సాఫ్ట్ వుడ్, ఇంధనం, వెదురు పొదలు, వివిధ రకాల అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చే అనేక ఇతర చిన్న అటవీ ఉత్పత్తులుగా స్థూలంగా వర్గీకరించవచ్చు. గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వన్యప్రాణుల భాండాగారాలు. జిల్లా అంతటా విషపూరితమైన, విషపూరితం కాని పాములు అనేకం కనిపిస్తాయి[16].
జనాభా గణాంకాలుసవరించు
2011 నాటి భారత జనాభా లెక్కలు ప్రకారం ఖమ్మం జనాభా (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపి) 3,13,504 గా ఉంది. ఇందులో పురుషులు 155,461 మంది కాగా, స్త్రీలు 158,043 మంది ఉన్నారు. సగటు 1000 మంది పురుషులకు 1017 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఖమ్మం పట్టణ జనాభా 250,182 కాగా, ఖమ్మం గ్రామీణ జనాభా 63,322 గా ఉంది. 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 32,172 మంది ఉన్నారు. వీరిలో 16,725 మంది బాలురు, 15,447 మంది బాలికలు ఉన్నారు. బాలల సగటు నిష్పత్తి 1000కి 924 గా ఉంది. సగటు అక్షరాస్యత రేటు 79.40% (7 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 223,380 అక్షరాస్యులతో, గణనీయంగా ఉంది. రాష్ట్ర సగటు 67.41% కంటే ఎక్కువగా ఉంది.[17][18]
కలెక్టరేట్ నూతన భవన సముదాయంసవరించు
జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలో ఖమ్మం వైరా ప్రధాన రహదారి వెంకటాయపాలెం వద్ద 53.20 కోట్ల రూపాయలతో 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 100 అడుగుల ఫేసింగ్, 11 వందల అడుగుల లోతు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది.[19] 2023, జనవరి 18న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కలిసి కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించారు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్లో కలెక్టర్ వీపీ గౌతమ్ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[20][21]
స్వాతంత్ర్యోద్యమంసవరించు
స్వాతంత్ర్య సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు.
- 1931 - ఖమ్మంలో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది.
- 1935 - ఖమ్మం పట్టణంలో మొదటి గ్రంథాలయం స్థాపించబడింది.
- 1945 - ఖమ్మంలో 12 వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం పెండ్యాల సత్య నారాయణరావు ప్రధాన కార్యదర్శిగా, అహ్వాన సంఘం నిర్వహించారు. ఆ సమావేశంలో బద్దాం ఎల్లారెడ్డిని అధ్యక్షుడిగా, 13 వ రాష్ట్రం ఆంధ్ర మహాసభకు ఉపాధ్యక్షుడిగా పెండ్యాల సత్య నారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సమావేశం మార్చి 26–28 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి దాదాపు 40,000 మంది హాజరయ్యారు.
- 1946 - 1946 ఆగస్టు 5 న మహాత్మా గాంధీ ఖమ్మం మెట్ (ఖమ్మం పట్టణం) సందర్శన,
- 1947 ఆగస్టు, 7 - జమలాపురం కేశవరావు, కూరపాటి వెంకట రాజు, జగదీశ్వరయ్య నీలకందన్, బచ్చలకూర లక్ష్మయ్య, వట్టికొండ రామకోటయ్య, హీరాలాల్ మోరియా, తీగల హనుమంతరావు, కిలిపాక కిషన్రవు, గెల్ల కేశవరావు, యాదవల్లి వెంకటేశ్వర శర్మ, పుల్లభట్ల వెంకటేశ్వర్లు (హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు), ఊటుకూరి కమల (స్వాతంత్ర్య సమరయోధురాలు - తెలంగాణ విమోచన)
సంస్కృతిసవరించు
శ్రీరామ భక్తుడు, కర్ణాటక సంగీత స్వరకర్త భక్త రామదాసు (కంచెర్ల గోపన్న)[22] పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు కళా క్షేత్రం[23] పేరుతో ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ థియేటర్ నిర్మించింది.
వరదలుసవరించు
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏటా ఖమ్మంలో అధిక వర్షపాతం నమోదవుతోంది. వర్షాకాలంలో వార్షిక వర్షపాతం 175 సెం.మీ. (60 అం.) గా ఉంటుంది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది వరదల కారణంగా ఖమ్మంలో చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2007లో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షంతో నదికి వరదలు వచ్చి బొక్కలగడ్డ ముంపునకు గురయింది. 2009లో వరదలు వచ్చినపుడు కూడా కొన్ని ముంపునకు గురయ్యాయి. ఖమ్మంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజీ కేంద్రాలు వరద బాధితుల కోసం ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందిస్తున్నాయి.
ఆరోగ్యంసవరించు
ఇక్కడ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, మమత వైద్య కళాశాల ఉన్నాయి.
పర్యాటక కేంద్రాలుసవరించు
ఇక్కడున్న ఖమ్మం కోట సా.శ. 950లో కాకతీయ రాజవంశంచే నిర్మించబడింది. లకారం సరస్సు మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇవి కాకుండా నగరం చుట్టూ భద్రాచలం, పర్ణశాల, నేలకొండపల్లి, కూసుమంచి వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి.
- ఖమ్మం ఖిల్లా
- శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- శ్రీ జలాంజనేయస్వామి ఆలయం
- లకారం చెరువు: ఈ చెరువుపై 11.75 కోట్ల రూపాయలతో నిర్మించిన కేబుల్ వంతెన, మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్లను 2022, జూన్ 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[24]
- దానవాయిగూడెం పార్కు
- తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
- లకారం పార్క్/ట్యాంక్ బండ్
- కిన్నెరసాని వన్యప్రాణి ఆశ్రయం
- నేలకొండపల్లి
- పర్ణశాల
- స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
- తెలంగాణ అమరవీరుల స్థూపం
ప్రముఖులుసవరించు
- హీరాలాల్ మోరియా (పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు)
- అభిరామ్ వర్మ (సినీ నటుడు,రచయిత)
- ముమ్మినేని సుధీర్ కుమార్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి[25][26]
పట్టణంలోని నివాస ప్రాంతాలుసవరించు
ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస, వాణిజ్య ప్రాంతాలు.
|
|
|
|
|
మూలాలుసవరించు
- ↑ "Basic Information". Official website of Khammam Municipal Corporation. Archived from the original on 11 February 2016. Retrieved 18 February 2016.
- ↑ 2.0 2.1 "Provisional Population Totals, Census of India 2011 Cities having population 1 lakh and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 7 July 2014.
- ↑ "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
- ↑ "Khammam". Telangana state portal. Retrieved 15 June 2015.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Krishna District Mandals" (PDF). Census of India. p. 145. Retrieved 21 February 2016.
- ↑ Staff Reporter, . (20 October 2012). "Khammam Municipality upgraded". The Hindu (in Indian English).
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216
- ↑ A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
- ↑ Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149
- ↑ A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London
- ↑ The Geography of India, J. Burgess, 1871, London, p. 48
- ↑ The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73
- ↑ https://books.google.co.in/books?id=5zeBDwAAQBAJ&pg=PA155&redir_esc=y#v=onepage&q&f=false
- ↑ Nizam's Guaranteed State Railway 1870
- ↑ "History | Khammam District | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-18.
- ↑ "Provisional Population Totals, Census of India 2011 Cities having population 1 lakh and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 7 July 2014.
- ↑ "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 July 2014. Retrieved 5 September 2014.
- ↑ telugu, NT News (2023-01-18). "సమీకృత కలెక్టరేట్ ముస్తాబు". www.ntnews.com. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
- ↑ telugu, NT News (2023-01-18). "ఖమ్మం కలెక్టరేట్కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు". www.ntnews.com. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
- ↑ "Khammam: కలెక్టరేట్, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన నలుగురు సీఎంలు". Samayam Telugu. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
- ↑ Kancherla Gopanna
- ↑ "Bhaktha Ramdas Kalakeshthram, Photo-India". Ugo.cn. Retrieved 2013-11-17.
- ↑ telugu, NT News (2022-06-11). "లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-06-11. Retrieved 2022-06-15.
- ↑ telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
- ↑ "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.