ఖుస్రో మంజిల్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లకిడీ కా పూల్ లో ఉన్న భవనం.

ఖుస్రో మంజిల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లకిడీ కా పూల్ లో ఉన్న భవనం. 1920లో ఏడవ నిజాం దళాల యొక్క చీఫ్ కమాండింగ్ ఆఫీసరైన ఖుస్రో జంగ్ బహదూర్ యొక్క నివాసంకోసం నిర్మించబడింది.[1]

ఖుస్రో మంజిల్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంలకిడీ కా పూల్, హైదరాబాదు, తెలంగాణ
పూర్తి చేయబడినది1920

నిర్మాణం మార్చు

ఏడవ నిజాం దగ్గర సైనిక దళాల చీప్ కమాండర్ గా ఖుస్రో జంగ్ బహదూర్ పనిచేసేవాడు. ఖుస్రో నివాసంకోసం 1920లో లక్డీకాపూల్ ప్రాంతంలో ఈ ఖుస్రో మంజిల్ ను నిర్మించారు. కోరింథియన్ పోర్టికో, భారీ యూరోపియన్ స్తంభాల మాదిరిగా నిర్మించబడింది.[2]

ఇతర వివరాలు మార్చు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించి, వారసత్వ జాబితాలోకి చేర్చింది. ఖుస్రో మంజిల్ యొక్క యాజమాన్యం అనేకసార్లు మారడంతోపాటు 2013 ఆగష్టులో ఇది కూల్చివేయబడింది.

మూలాలు మార్చు

  1. "Activists see red over Khusro Manzil demolition". 23 August 2013. Retrieved 21 January 2019.
  2. "Khusro Manzil". Retrieved 21 January 2019.