ఖేడా సత్యాగ్రహం (1918)

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన తిరుగుబాటు

ఖేడా సత్యాగ్రహం 1918 సంవత్సరం భారతదేశంలోని గుజరాత్ లోని ఖేడా జిల్లాలో బ్రిటీషు రాజ్ కాలంలో మహాత్మా గాంధీచే ప్రేరణ పొందిన మూడవ సత్యాగ్రహ ఉద్యమంగానూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన తిరుగుబాటుగానూ ప్రత్యేకత సంతరించుకుంది. చంపారన్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు సమ్మెకు ముందు ఇది రెండవ సత్యాగ్రహ ఉద్యమంగా మరొక ప్రత్యేకత కలిగి ఉంది. ఖేడా జిల్లాలోని రైతులకు మద్దతుగా గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిర్వహించాడు. పంటల వైఫల్యం, ప్లేగు, అంటువ్యాధుల కారణంగా బ్రిటీషు వారు విధించిన పన్నులను ఖేడా ప్రజలు చెల్లించలేకపోయారు.[1][2][3]

ఖేడా సత్యాగ్రహం
1917లో గాంధీ ఖేడా సత్యాగ్రహాన్ని నడిపించినప్పటి చిత్రం
ఆంగ్ల నామంKheda Satyagraha
తేదీ1917
ప్రదేశంగుజరాత్ లోని ఖేడా జిల్లా
నిర్వాహకులుమహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందులాల్ యాజ్ఞిక్, శంకర్ లాల్ బాంకర్, మహదేవ్ దేశాయ్, నరహరి పారిఖ్, మోహన్ లాల్ పాండ్యా, రవిశంకర్ వ్యాస్

నాయకులు మార్చు

గుజరాతులో మహాత్మా గాంధీ ఆ పోరాటానికి ఆధ్యాత్మికంగా ఆధిపత్యం వహించాడు. ఆయన కుడిభుజం వంటి కార్యకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీయ భావంతో అంకితం భావంతో పనిచేసే ఇంద్రుల్ యాగ్నిక్, శంకర్ లాల్ బ్యాంకర్, మహదేవ్ దేశాయ్, నరహరి పారిఖ్, మోహన్ లాల్ పాండ్య, రవిశంకర్ వ్యాస్ గ్రామకార్యకర్తలు కలిసి ఈ సత్యాగ్రహం నిర్వహించారు. వారికి రాజకీయ నాయకత్వం, మార్గదర్శక అధికారం ఇచ్చారు.[3] అహ్మదాబాదు వదోదర నగరాల నుండి అనేక మంది గుజరాతీయులు తిరుగుబాటు నిర్వాహకులలో చేరారు. గాంధీ, పటేల్ పూర్తిగా గుజరాతీయుల పోరాటంలో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయుల పాత్రను నిరాకరించారు.

ఘర్షణ మార్చు

పటేల్, అతని సహచరులు బృహత్తరమైనపన్ను తిరుగుబాటును నిర్వహించారు. ఖేడాలోని వివిధ జాతి, కుల వర్గాలు తిరుగుబాటు పట్ల ఆసక్తులయ్యారు. ఖేడా రైతులు ఈ సంవత్సరం సంభవించిన కరువును కారణంగా చూపుతూ పన్ను రద్దు చేయాలని పిటిషన్ సమర్పించాలని పిలుపునిచ్చారు. బొంబాయి ప్రభుత్వం చార్టర్ను తిరస్కరించింది. రైతులు పన్ను చెల్లించకపోతే భూములు ఆస్తులు జప్తు చేయబడతాయని, చాలామంది ఖైదు చేయబడతారని, ఒకసారి జప్తు చేయబడి ఆస్తులు వారు చాలా కట్టుబడి ఉన్నా వారికి తిరిగి ఇవ్వబడదు అని హెచ్చరించారు.

ఆస్తులు, పశువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అధికారులు, ఇన్స్పెక్టర్లను పంపాబడ్డారు. పోలీసులు భూములు, వ్యవసాయ భూములు, ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. రైతులు ఖైదును అడ్డుకోలేదు. హింసతో పనిచేసే అధికారులను అహింసతో ఎదుర్కొన్నారు. బదులుగా వారు గుజరాత్ సభకు విరాళంగా తమ నగదు, విలువైన వస్తువులను అందించారు. నిరసన అధికారికంగా నిర్వహించబడింది.[విడమరచి రాయాలి].

తిరుగుబాటు క్రమశిక్షణ, ఐక్యత ప్రభుత్వవర్గాలలో భీతిని కలుగజేసింది. వారి వ్యక్తిగత ఆస్తి, భూమి, జీవనోపాధిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, పటేలుకు మద్దతుగా ఖేడా రైతులలో అత్యధికులు బలంగా ఐక్యమయ్యారు. ఇతర ప్రాంతాలలో తిరుగుబాటుకు గురైన గుజరాతీలు ప్రభుత్వ యంత్రాన్ని ప్రతిఘటించారు. నిరసనకారుల బంధువులు నిరసనకారులకు ఆశ్రయం ఇచ్చి ఆస్తులను బధ్రపరచడానికి సహాయపడ్డారు. తిరుగుబాటుల దారుల నుండి స్వాధీనం చేసుకున్న భూములను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వారిని భారతీయులు సమాజం నుండి వెలివేసారు. ఇతర ప్రాంతాలలోని సానుభూతి పరులకు సార్డుల్ సింగ్ కేవలెలాంటి జాతీయవాదులు పిలుపునిచ్చినప్పటికీ గాంధీ, పటేల్ ఈ ఆలోచనలను గట్టిగా తిరస్కరించారు.

ఫలితం మార్చు

రెండు పార్టీలకు ఒప్పందం. సంవత్సరానికి పన్ను, తదుపరి పన్ను తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. జప్తు చేయబడిన ఆస్తి తిరిగి ఇవ్వబడుతుందని, అధికరించిన పన్ను శాతం తగ్గించబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న భూములను వారి నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వటానికి ప్రజలు కూడా సహకారంతో పనిచేశారు. స్వాధీనం చేసుకున్న భూములను స్వాధీనం చేసుకున్నవారు బ్రిటిషు అధికారికంగా అది కొనుగోలుదారులకు చెందుతాయని చెప్పినప్పటికీ కొనుగోలుదారులు వాటిని తిరిగి మునుపటి యజమానులకు తిరిగి స్వాధీనం చేసారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Basu, Vipu; Singh, Jasmine Dhillon, Gita Shanmugavel, Sucharita. History And Civics (in ఇంగ్లీష్). Pearson Education India. ISBN 9788131763186.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  2. Rai, Ajay Shanker (2000). Gandhian Satyagraha : An Analytical And Critical Approach (in ఇంగ్లీష్). Concept Publishing Company. ISBN 9788170227991.
  3. 3.0 3.1 Sarkar, Sumit. Modern India 1886-1947 (in ఇంగ్లీష్). Pearson Education India. ISBN 9789332540859.