గల్లా అరుణకుమారి
గల్లా అరుణకుమారి భారత రాజకీయ నాయకురాలు. ఆమె భారత పార్లెమెంటు సభ్యురాలు.[1]
గల్లా అరుణకుమారి | |
---|---|
గల్లా అరుణకుమారి | |
జననం | గల్లా అరుణకుమారి ఆగష్టు 1, 1949 దిగువమాఘం |
వృత్తి | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి |
ప్రసిద్ధి | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ శాసనసభ సభ్యురాలు , మంత్రి |
పదవి పేరు | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి |
పదవీ కాలం | 1989:చంద్రగిరి నియోజకవర్గం శాసన సభ్యులు 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్.ఎల్.ఎ మొత్తం మూడు సార్లు మంత్రి పదవి |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ (2013 వరకు), తెలుగుదేశం పార్టీ (2014 నుండి) |
మతం | హిందూ మతము |
భార్య / భర్త | గల్లా రామచంద్ర నాయుడు |
పిల్లలు | గల్లా జయదేవ్ , గౌరినేని రమాదేవి |
తండ్రి | పాతూరి రాజగోపాల నాయుడు |
తల్లి | అమరావతమ్మ |
జీవిత విశేషాలుసవరించు
గల్లా అరుణ కుమారి ఆగష్టు 1, 1949లో పాటూరి రాజగోపాలనాయుడు, అమరావతమ్మ దంపతులకు జన్మించింది. దిగువమాఘం ఈమె స్వగ్రామము.
అరుణ కుమారి అమరరాజా సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడును వివాహము చేసుకున్నది. జయదేవ్, రమాదేవి వీరి సంతానము. కంప్యూటర్ విభాగములో బి.యస్. డిగ్రీ పొంది కొన్ని దినములు క్రైస్లెర్ కార్పొరేషన్ లో కంప్యూటర్ ప్రోగ్రామరుగా, డిపార్ట్మెంటు హెడ్డుగా పనిచేసింది.
రాజకీయ జీవితంసవరించు
అరుణకుమారి తన రాజకీయ జీవితములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు గానూ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ గానూ వ్యవహరించింది. ఆ తరువాత చంద్రగిరి నియోజక వర్గం నుండి 1989 లో మొదటి సారి, 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు ఎమ్.ఎల్.ఎగా విజయాన్ని సాధించింది. శాసనసభకు ఎన్నికైన తరువాత మూడు సార్లు మంత్రి పదవిని అలంకరించింది. 2008వ సంవత్సరంలో వైద్య విద్య, ఆరోగ్య బీమా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈమె ఆరోగ్యశ్రీ పథక విజయానికి ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాల్గవ సారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టినది. నవంబరు 2010 లో రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖలో భూగర్భ, గనుల శాఖా మంత్రిగా స్థానము పొందినది. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని విడనాడి, తెలుగుదేశం పార్టీలో చేరి, 2014 శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ చంద్రగిరి నియోజక వర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అదే సమయంలో రాజకీయ అరంగేట్రం చేసిన తన తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు నియోజక వర్గానికి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడంతో పుత్రోత్సాహం పొందారు.
మూలాలుసవరించు
- ↑ "Profile - Smt Aruna Kumari". Andhra Pradesh Govt. Archived from the original on 2009-02-02. Retrieved 2009-07-13.