గోమఠం శ్రీనివాసాచార్యులు

గోమఠం శ్రీనివాసాచార్యులు రంగస్థల నటుడు, నాటక రచయిత. 1880లో మద్రాస్ లో ది మద్రాసు ఓరియంటల్ డ్రమాటిక్ కంపెనీ అనే నాటక సంస్థసు స్థాపించాడు.[1]

గోమఠం శ్రీనివాసాచార్యులు
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక రచయిత

నాటకరంగ ప్రస్థానం

మార్చు

రచించిన నాటకాలు

మార్చు
  1. హరిశ్చంద్ర, ది మైర్టీర్ టూ ట్రూత్ (ఆంగ్లం) : హరిశ్చంద్ర ఆంగ్ల నాటకం 1892-93 మధ్యకాలంలో జగన్నాథవిలాసినీసభ వారిచే ప్రదర్శించబడి, 1897లో ముద్రించబడింది. ఈ నాటకంలో మూడు అంకాలు, అనేక రంగాలు ఉన్నాయి.
  2. కమలాపహరణము: ఇది పది అంకాల నాటకం. పార్శీ నాటక సమాజంవారు మద్రాస్ వచ్చిన సమయంలో ప్రదర్శించిన గులేబకావలి అనే హిందుస్థానీ నాటకాన్ని చూసిన శ్రీనివాసాచార్యులు ఆ కథను స్వీకరించి తెలుగులో కమలాపహరణము నాటకంగా రాశాడు. ఇది 1919లో ముద్రించబడింది.
  3. అసంపూర్ణ నాటకం: ఈ నాటకంలోని 3 అంకాలు మాత్రమే లభించాయి. ఆ భాగాలు 1955 జూలై-ఆగస్టు నెలలో ఆంధ్రదిన పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇది వ్యవహారిక భాషలో రాయబడిన కల్పిత కథ.

మూలాలు

మార్చు
  1. గోమరం శ్రీనివాసాచార్యులు, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 277-278.