గౌతు శిరీష ఆంధ్రప్రదేశ్​కు చెందిన రాజకీయ నాయకురాలు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గానికి తెలుగుదేశం నేత. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట నాయకుడైనా సర్దార్​ గౌతు లచ్చన్న మనవరాలు.

గౌతు శిరీష గౌతు శ్యాం సుందర్ శివాజీ, విజయలక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె 1996వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని అడ్మినిస్ట్రేషన్ పైడా కాలేజ్​లో MBA (మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేసింది. అంతేకాకుండా 2015లో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోనే NBM లా కాలేజ్​లో బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసింది.

ఈమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్​ శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్​ తరఫున పోటీ చేసిన సిదిరి అప్పల్రాజు, శీరిషపై 16,247 ఓట్ల తేడాతో విజయం సాధించారు.