చదిపిరాళ్ల శివనాథ రెడ్డి

చదిపిరాళ్ల శివనాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1] శివనాథ్‌రెడ్డి మాజీ మంత్రి సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు.

చదిపిరాళ్ల శివనాథ రెడ్డి

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2019 మార్చి 8 – 2023 మార్చి 20
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-05) 1964 మే 5 (వయసు 59)
కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు శివశంకర్ రెడ్డి, పుల్లమ్మ
జీవిత భాగస్వామి ఉమాదేవి
నివాసం కడప

రాజకీయ జీవితం మార్చు

చదిపిరాళ్ల శివనాథ రెడ్డి ఎన్టీఆర్ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అనంతరం టీడీపీలో చేరి 2019 మార్చిలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో గవర్నర్‌ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. శివనాథ రెడ్డి ఏపీ శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు - అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విఫ్‌ను ధిక్క‌రించి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశాడు.[2] శాసనమండలిలో విప్ ధిక్కరించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి ఛైర్మన్‌కు లేఖ రాసింది.[3]

మూలాలు మార్చు

  1. "Chadipiralla Sivanatha Reddy". Retrieved 2021-03-28.
  2. 10TV (5 February 2020). "వైసీపీలో శివనాథ్‌రెడ్డి చేరికకు అంతరాయం!" (in telugu). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. ETV Bharat News (1 April 2022). "ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ పై జూన్ 3 న విచారణ". Retrieved 1 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)