చల్లపల్లి స్వరూపరాణి

చల్లపల్లి స్వరూపరాణి తొలి దళిత స్త్రీవాద రచయిత్రిగా ప్రసిద్ధి చెందింది.

చల్లపల్లి స్వరూపరాణి
జననంఎం.బి.ఎస్.స్వరూప
ప్యాపర్రు,అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ India
నివాస ప్రాంతంవిజయవాడ
వృత్తిఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్
తండ్రిమంత్రయ్య
తల్లిమరియమ్మ

వివరాలు మార్చు

ఈమె 1970, మే 25న గుంటూరు జిల్లా, ప్యాపర్రు గ్రామంలో మంత్రయ్య, మరియమ్మ దంపతులకు జన్మించింది.[1] ఈమె కథలు, కవితలు వ్రాసింది. ఈమె వ్రాసిన కొన్ని రచనలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి తర్జుమా అయ్యాయి. ఈమె 1992లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ప్రాచీన భారత చరిత్ర & పురావస్తు శాస్త్రంలో ఎం.ఎ. పట్టా పొందింది. 1996లో హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో ఎం.ఫిల్, 2007లో పి.హెచ్‌డి పట్టాలను పొందింది. ఈమె 1999 నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి 9 సంవత్సరాలు పనిచేసింది. పిమ్మట 2008లో నాగార్జున విశ్వవిద్యాలయంలోని మహాయాన బౌద్ధ అధ్యయనాల కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలను అందించింది. 2011లో ప్రొఫెసర్‌గా పదోన్నతిని పొందింది. ఈమె 81కి పైగా వివిధ సెమినార్లలో, వర్కుషాపుల్లో పాల్గొని పత్రసమర్పణ గావించింది. వివిధ పత్రికలలో బుద్ధిజం గురించి, జాషువా సాహిత్యం గురించి, దళిత రచయిత్రుల గురించి, గిరిజన సంస్కృతి గురించి ఇంకా వివిధ విషయాలపై 56కు పైగా వ్యాసాలను రచించింది. ఇంకా ఈమె "చారిత్రక పరిశోధన" అనే అర్ధవార్షిక పత్రికకు, "బహుజన కెరటాలు" అనే మాసపత్రికకు సంపాదకురాలిగా ఉన్నది. "మన చరిత్ర - సంస్కృతి" మాసపత్రికకు, "Samanthara Voice" పత్రికకు సంపాదక వర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నది. ఈమె పలు సామాజిక, విద్యాసంబంధ సంస్థలలో సభ్యురాలిగా క్రియాశీలకంగా ఉంది.[2]

రచనలు మార్చు

  1. అస్తిత్వ గానం
  2. మంకెనపువ్వు
  3. Caste, Religion and State in Medieval South India
  4. Facets of Gender Discrimination and Violence
  5. Tribe- Peasant- Elite Dynamics in Medieval Andhra

పురస్కారాలు మార్చు

  • సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నుండి కవితా సంపుటి ప్రచురణకు ఆర్థిక సహాయం
  • 2002లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి నాళం కృష్ణారావు ధర్మనిధి పురస్కారం
  • 2006లో విమలా శాంతి సాహితీ పురస్కారం.
  • 2007లో మంకెనపువ్వు కవితా సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ గ్రంథంగా సాహిత్య పురస్కారం.
  • 2009-2010 సంవత్సరానికి గాను లాడ్లి మీడియా అవార్డు
  • 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మహాకవి గుర్రం జాషువా సాహిత్య పురస్కారం.
  • 2015లో జానపద కళాపీఠం, అద్దంకి వారిచే గుర్రం జాషువా పురస్కారం.
  • 2015లో యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్.సి, ఎస్.టి ఎంప్లాయీస్, వరంగల్లు వారిచే గుర్రం జాషువా పురస్కార్
  • 2016లో దళిత్ ఓపెన్ యూనివర్సిటీ, ఫిరంగిపురం వారిచే డా.అంబేద్కర్ జాతీయ అవార్డ్.

ఇవికూడా చూడండి మార్చు

1.దళిత స్త్రీవాదం

మూలాలు మార్చు

  1. Thummapudi, Bharathi (2008). A History of Telugu Dalit Literature. p. 188. ISBN 81-7835-688-0.
  2. "నాగార్జున విశ్వవిద్యాలయం జాలస్థలిలో చల్లపల్లి స్వరూపరాణి వివరాలు" (PDF). Archived from the original (PDF) on 2019-08-19. Retrieved 2017-04-18.