చింతకింది శ్రీనివాసరావు

చింతకింది శ్రీనివాసరావు తెలుగు కథా రచయిత. ఈయన విశాఖపట్నం వాస్తవ్యులు. ఈయన రాసిన కథలు ఉత్తరాంధ్ర మాండలికానికి దర్పణం. [1]  రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు చింతకింది కథల గురించి ప్రస్తావిస్తూ, ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో లేదా కళింగాంధ్ర దృక్పథంలోనే ఈ వైరుధ్యాల్ని పసిగట్టే స్వభావం అంతర్లీనంగా ఉందో తెలియదు గానీ, అక్కడ పుట్టిన కథలు కంచికి వెళ్లవని, అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయని తెలిపారు. చింతకింది కథల్లో కనిపించే జీవితం ఒక సోషియాలజీకి తలుపులు తెరుస్తుందని అభిప్రాయపడ్డారు.

చింతకింది శ్రీనివాసరావు
నివాస ప్రాంతంవిశాఖపట్నం
ప్రసిద్ధికథా రచయిత, జర్నలిస్టు

 [2]

రచనలు మార్చు

  • దాలప్ప తీర్థం (కథల సంపుటి)
  • కప్ప స్తంభం (కథల సంపుటి) 
  • బుగతలనాటి చుక్కపల్లి (కథల సంపుటి)
  • కాన్పులదిబ్బ (కథల సంపుటి)  
  • పతంజలి మోనోగ్రాఫ్
  • అలివేణీ ఆణిముత్యమా
  • ఆచార్య ఎన్.గోపి ఆధ్వర్యంలో ‘నానీ’లపై సమగ్ర పరిశోధన గ్రంథం  

పురస్కారాలు మార్చు

  • కె.ఎన్‌.వై పతంజలి పురస్కారం 
  • చాసో పురస్కారం [3]
  • మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం  [4] 
  • శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం  
  • పీచర సునీతా రావు అవార్డు - 2023

మూలాలు, వనరులు మార్చు

  1. "కళింగాంధ్ర వారసుడు". July 24, 2013. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)[permanent dead link]
  2. "మానవీయ కోణాల కథల గని". Jan 24, 2015. Archived from the original on 2020-03-28. Retrieved 2020-03-28.
  3. "చాసో పురస్కారం". Jan 9, 2015. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)
  4. "మానవీయ కోణాల కథల గని". Jan 24, 2015. Archived from the original on 2020-03-28. Retrieved 2020-03-28.