చినగాదెలపర్రు బాపట్ల జిల్లా, అమృతలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • ఈ గ్రామానికి చెందిన శ్రీ ఐనంపూడి కోటేశ్వరరావు, నగరాజకుమారి దంపతుల కుమార్తె సాయిస్పందన, 2014 మార్చిలో నిర్వహించిన ఇంటరు ద్వితీయ సంవత్సరం పరీక్షలలో, ఎం.ఈ.సి.విభాగంలో 984 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమె చిన్నతనం నుండి ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానం సాధించుచూ, 10వ తరగతిలో 9.8 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం సి.ఏ./సి.పి.టి కొరకు శిక్షణ తీసుకుంటున్న ఈమె, దేశంలోని అత్యుత్తమమైన పది కంపెనీలలో ఒక దానిలో ఛార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేయాలని కోరుకొంటున్నది.