జంగాలపల్లి (నూజెండ్ల)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండల కుగ్రామం

జంగాలపల్లి పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలుచేసిన మద్యనిషేధం ఈ గ్రామస్థులకి స్ఫూర్తినిచ్చింది. అప్పట్లో విధించుకున్న కట్టుబాట్లను నేటికీ కొనసాగిస్తూ, పదుగురికి గర్వంగా చాటుకుంటున్నారు. తర్వాత కొంతకాలానికి మద్యనిషేధం సడలించటంతో, గ్రామంలో అల్లర్లు, నీతి తప్పి ప్రవర్తించడం సహించలేక, గ్రామంలో అన్ని కులాల పెద్దలూ ఒక కమిటీగా ఏర్పడి, మద్యనిషేధం ప్రకటించుకున్నామని జంగాలపల్లి గ్రామస్థులు చెపుచున్నారు. గత 15 ఏళ్ళుగా గ్రామంలో మద్యనిషేధం అమలు కావడం విశేషం.

మూలాలు మార్చు